భారత్లోని తైవాన్ రాయబార కార్యాలయం తమ 109వ జాతీయ దినోత్సవాన్ని జరుపుకొంది. ఈ నేపథ్యంలో భారత రాజకీయ నాయకులు, ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా తైవాన్కు శుభాకాంక్షలు తెలిపారు.
దిల్లీలోని చైనా రాయబార కార్యాలయం సమీపంలో తైవాన్కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్లు వెలిశాయి. శాంతిపథ్ మార్గంలో ఉన్న ఈ పోస్టర్లను భాజపా నేత తజీందర్ పాల్ సింగ్ బగ్గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
భారత్కు కృతజ్ఞతలు..
తైవాన్ను దేశంగా గుర్తించవద్దని కోరుతూ భారత మీడియాకు చైనా సూచించిన క్రమంలో ఈ వేడుకలు జరగటం విశేషం. తమకు మద్దతుగా నిలిచిన భారత ప్రజలకు ఈ మేరకు తైవాన్ రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. తైవాన్ విదేశాంగ శాఖ కూడా భారత్కు కృతజ్ఞతలు తెలిపింది.
"109వ జాతీయ దినోత్సవం సందర్భంగా మాకు మద్దతుగా నిలిచిన భారత మిత్రులకు కృతజ్ఞతలు. కరోనా విపత్తు, సరఫరా వ్యవస్థల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పరస్పర సహకారం కోసం ఎదురుచూస్తున్నాం."
- భారత్లోని తైపీ ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం
ఇదీ చూడండి:18 విమానాలతో చైనా విన్యాసాలు.. అమెరికాకు హెచ్చరిక?