తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఠాగూర్​ గడ్డపై మత రాజకీయాలు సాగవు' - లౌకికవాదంపై మమత

మత రాజకీయాలను రవీంద్రుడి నేల అంగీకరించదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ అన్నారు. విభజన రాజకీయాలతో విశ్వభారతి విశ్వవిద్యాలయం గొప్పతనాన్ని భాజపా దెబ్బతీయాలనుకుంటోందని మండిపడ్డారు.

Tagore's land will never allow hate politics to overpower secularism: Mamata
"మత రాజకీయాలను ఠాగూర్​ భూమి అంగీకరించదు"

By

Published : Dec 29, 2020, 5:11 PM IST

Updated : Dec 29, 2020, 5:32 PM IST

లౌకికవాదాన్ని అతిక్రమించే రాజకీయాలను నోబెల్​ గ్రహిత రవీంద్రనాథ్ ఠాగూర్​ నడయాడిన నేల అంగీకరించదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ఉద్ఘాటించారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్​లర్​ విద్యుత్​ చక్రవర్తి భాజపా మనిషని ఆరోపించారు. కళాశాలలో మత రాజకీయాలను సృష్టించి, వారసత్వ గొప్పదనాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారని మండిపడ్డారు.

బోల్​పుర్​లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో భాజపాపై నిప్పులు చెరిగారు మమత.

మహాత్మగాంధీ వంటి మహానుభాహులను గౌరవించనివారు బంగారు బంగాల్​ను నిర్మిస్తామంటున్నారు. దశాబ్దాల క్రితమే రవీంద్రుడు బంగారు బెంగాల్​ను తయారు చేశారు. భాజపా మత రాజకీయాల నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించుకోవడం మన విధి. భాజపా బయట వ్యక్తులు పాలించేది.

-మమతా బెనర్జీ, పశ్చిమ బంగా సీఎం

టీఎంసీ ఫిరాయింపులపై స్పందించిన మమత.. కొంతమంది ఎమ్మెల్యేలను కమలదళం తీసుకోవచ్చు కానీ తమ పార్టీని కొనలేరని అన్నారు.

ఇదీ చదవండి:'200 స్థానాలు గెలుస్తాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'

Last Updated : Dec 29, 2020, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details