తెలంగాణ

telangana

ఎన్​ఆర్​సీపై మోదీ వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి: పవార్​

By

Published : Dec 23, 2019, 7:12 PM IST

దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ ప్రతిపాదనపై దిల్లీలో మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ స్పందించారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్య పరిచాయన్నారు.

Surprised over Modi's NRC comments: Pawar
మోదీ ఎన్​ఆర్​సీ వ్యాఖ్యలకు నేను ఆశ్చర్యపోయా: పవార్​

దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ ప్రతిపాదనపై మోదీ చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్య పరిచాయన్నారు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​​. గతంలో ఎన్​ఆర్​సీ ప్రతిపాదనపై పార్లమెంటులో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రస్తావించారని పవార్​ గుర్తుచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్​షా కూడా ఎన్​ఆర్​సీపై రాజ్యసభలో మాట్లాడినట్లు పేర్కొన్నారు.

ప్రతి ఆడుగులోనూ భాజపా ప్రభుత్వం విఫలమైనట్లుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి ప్రజల దారి మరల్చేందుకు చూస్తున్నారు. అంతకు మించి వారి ప్రసంగంలో ఇంకేం కనిపించలేదు.

శరద్ పవార్​, ఎన్​సీపీ అధినేత

ఆదివారం దిల్లీలోని రామ్​లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో.. తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ అమలు ప్రతిపాదనపై చర్చించలేదని మోదీ వ్యాఖ్యానించారు. సుప్రీం ఆదేశాల మేరకు ఒక్క అసోంలో మాత్రమే ఎన్​ఆర్​సీని అమలు చేసినట్లు ప్రధాని తెలిపారు.

ఝార్ఖండ్​ ఫలితాలే నిదర్శనం..

మరోవైపు ఝార్ఖండ్​ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పవార్... భాజపాకు ప్రజలు గట్టిగా సమాధానం ఇచ్చారని అభిప్రాయపడ్డారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఝార్ఖండ్​లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇది ఆదివాసీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. పేదరికం అధికం. ఇలాంటి పరిస్థితుల్లో భాజపా అధికారం చేజిక్కించుకోవడం కోసం ధన బలం చూపేందుకు ప్రయత్నించింది. కానీ ఝార్ఖండ్​ ప్రజలు దాన్ని స్వీకరించలేదు. అందుకు ఆ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా.

శరద్​ పవార్​, ఎన్​సీపీ అధినేత

ఏడాది వ్యవధిలోనే ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, మహారాష్ట్రతో పాటు తాజాగా ఝార్ఖండ్​లోనూ భాజపాకు ఓటమి ఎదురైంది. భాజపా పతనం మొదలైందనడానికి ఇదే నిదర్శనమని శరద్​ పవార్​ అన్నారు.

ఇదీ చూడండి: 'పౌరసత్వం పేరుతో భారతీయులను వేధించం'

ABOUT THE AUTHOR

...view details