బిహార్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే సీఈసీ నిర్ణయం తీసుకుంటుందని వివరించింది.
బిహార్ ఎన్నికల వాయిదాపై పిటిషన్ కొట్టివేత - బిహార్
కరోనా, వరదల ప్రభావం తగ్గేవరకు బిహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలనే పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది.
![బిహార్ ఎన్నికల వాయిదాపై పిటిషన్ కొట్టివేత Supreme Court refuses to entertain a plea seeking directions for Election Commission to refrain from holding upcoming election in Bihar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8587451-202-8587451-1598595835206.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వాయిదా పిటిషన్ తిరస్కరణ
ఎన్నికల వాయిదాకు కరోనా అంశం ప్రాతిపదిక కాదని పేర్కొంది జస్టిస్ అశోక్ భూషణ్తో కూడిన ధర్మాసనం. ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకముందే పిటిషన్ వేయడాన్ని తప్పుపట్టింది.
Last Updated : Aug 28, 2020, 12:38 PM IST