తెలంగాణ

telangana

By

Published : Nov 5, 2019, 6:54 PM IST

Updated : Nov 5, 2019, 7:17 PM IST

ETV Bharat / bharat

'మసీదుల్లోకి మహిళల ప్రవేశం'పై విచారణ వాయిదా

మసీదుల్లోకి మహిళల ప్రవేశానికి అనుమతి కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు 10 రోజులపాటు వాయిదా వేసింది. ఇందుకు భిన్నకారణాలు ఉన్నాయని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అవేంటో మాత్రం తెలపలేదు.

సుప్రీంకోర్టు

'మసీదుల్లోకి మహిళల ప్రవేశం'పై విచారణ వాయిదా

మసీదుల్లో ముస్లిం మహిళల ప్రవేశాన్ని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. భిన్నమైన కారణాలతో ఈ వ్యాజ్యం విచారణను పదిరోజులు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే ఆ కారణాలు ఏమిటన్నవి సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించలేదు.

మసీదుల్లో ముస్లిం మహిళల ప్రవేశంపై నిషేధం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పుణెకు చెందిన యస్మీన్​, జుబెర్​ అహ్మద్ నజీర్ అహ్మద్ పీర్జాడే దంపతులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇది లింగ సమానత్వాన్ని కూడా దెబ్బతీస్తోందని వారు వాదించారు. ముస్లిం మహిళలు మసీదుల్లో ప్రవేశించి నమాజ్ చేయడానికి అనుమతించేలా ప్రభుత్వ అధికారులు, ముస్లిం సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని తమ పిటిషన్​లో కోరారు.

నాలుగు వారాల సమయం

ఈ వ్యాజ్యంపై తమ స్పందనను తెలిపేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాల్సిందిగా కొన్ని పక్షాలు కోరాయని సుప్రీంకోర్టు తెలిపింది.

ఇంతకు ముందు ఇదే వ్యాజ్యంపై విచారణ చేపట్టిన సుప్రీం.. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ, న్యాయశాఖ, మైనారిటీ వ్యవహారాలశాఖ సహా జాతీయ మహిళా కమిషన్​కు కూడా నోటీసులు జారీచేసింది. వ్యాజ్యంపై తమ ప్రతిస్పందనను నవంబర్ 5లోగా తెలపాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: సాంకేతికతతోనే అభివృద్ధి సాధ్యం: మోదీ

Last Updated : Nov 5, 2019, 7:17 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details