దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్కు ఈ రోజు జీవితాంతం గుర్తుండిపోనుంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి అఖండ విజయం సాధించిన రోజే.. తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు సునీత. ఫలితాలు వెలువడిన అనంతరం కుటుంబ సభ్యులు, పార్టీ నేతల సమక్షంలో కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు.
కేజ్రీవాల్ ఘన విజయం సాధించి తన పుట్టిన రోజు కానుకగా జీవితంలోనే అతిపెద్ద బహుమతి ఇచ్చారని చెప్పారు సునీత. దిల్లీ ప్రజలు నిజాన్ని గెలిపించారని అన్నారు.
నో క్రాకర్స్..
దిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కార్యకర్తలు ఎవరూ బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించవద్దని ఆదేశించారు కేజ్రీవాల్. వాయు కాలుష్యాన్ని నియంత్రించాలని సూచించారు.