భారత్, బంగ్లాదేశ్ మధ్య 55 ఏళ్లుగా నిలిచిపోయిన రైలు సేవల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మార్గంలో గురువారం ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేశారు అధికారులు. బంగాల్లోని జల్పాయ్గుడిలోని హల్దీబడి నుంచి బంగ్లాదేశ్లోని చిలహటి వరకు ఈ రైలు మార్గం ఉంది.
భారత్తో అప్పటి తూర్పు పాకిస్థాన్ మధ్య 1965లో సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో రైలు సేవలను నిలిపేశారు. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత కూడా ఈ నిలుపుదలను కొనసాగించారు.
ఘన స్వాగతం..
ప్రస్తుతం ఏర్పాట్లలో భాగంగా అక్టోబర్ 8న లోకో ఇంజిన్ ట్రయల్ రన్ను ఈశాన్య సరిహద్దు రైల్వే నిర్వహించింది. సరిహద్దుకు ఇరువైపులా ఈ ట్రయల్ రన్కు ఘన స్వాగతం లభించింది. మరికొన్ని రోజుల్లో బంగ్లాదేశ్ కూడా ఈ తరహా ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.