తెలంగాణ

telangana

సీఏఏ, ఎన్ఆర్​సీకి వ్యతిరేకంగా దిల్లీలో విద్యార్థుల ర్యాలీ

By

Published : Jan 20, 2020, 5:50 PM IST

Updated : Feb 17, 2020, 6:06 PM IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు మండీ హౌస్ నుంచి జంతర్​మంతర్​ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు ఇందులో భాగస్వాములయ్యారు.

Students protest at Mandi House against CAA, NRC
సీఏఏ, ఎన్ఆర్​సీకి వ్యతిరేకంగా దిల్లీలో విద్యార్థుల ర్యాలీ

సీఏఏ, ఎన్ఆర్​సీకి వ్యతిరేకంగా దిల్లీలో విద్యార్థుల ర్యాలీ

జాతీయ పౌర పట్టిక, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. దిల్లీలో వందలాది మంది విద్యార్థులు మండీ హౌస్​ నుంచి జంతర్​ మంతర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సీఏఏ, ఎన్ఆర్​సీలను నిషేధించాలని మాస్కులు ధరించి కవాతు​ నిర్వహించారు. జేఎన్​యూ మాజీ విద్యార్థులు సైతం ఈ నిరసనల్లో పాల్గొన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టం అమలును వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికే తాము నిరసనలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: కోర్టు బయట రాజ్యాంగ పీఠిక చదివిన లాయర్లు.. కారణమిదే!

Last Updated : Feb 17, 2020, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details