తెలంగాణ

telangana

By

Published : Jan 22, 2021, 11:57 AM IST

Updated : Jan 22, 2021, 1:09 PM IST

ETV Bharat / bharat

' 'ఆత్మనిర్బర్​ భారత్' కోసం​ విద్యార్థిలోకం శ్రమించాలి'

అసోం తేజ్​పుర్​ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. విద్యార్థి లోకమంతా ఆత్మనిర్భర్ భారత్​ సాధన కోసం పరితపించాలని పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా గడ్డపై విజయదుందుబి మోగించిన టీమ్​ ఇండియాను ప్రశంసించారు. పాజిటివ్​ ఆలోచనలో ముందుకు సాగితే సానుకూల ఫలితాలు వస్తాయనేందుకు ఈ విజయం నిదర్శనమన్నారు.

Students must strive to create 'Atmanirbhar Bharat'
'ఆత్మనిర్బర్​ భారత్​ సాధన కోసం విద్యార్థిలోకం శ్రమించాలి'

విద్యార్థిలోకమంతా ఆత్మనిర్భర్ భారత్​ సాధన కోసం శ్రమించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పాజిటివ్​ ఆలోచనలతో ముందుకు సాగితే సత్ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఇటీవల ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించి టెస్టు సిరీస్​ను కైవసం చేసుకున్న టీం ఇండియాను ఇందుకు ఉదహరించారు.

అసోం తేజ్​పుర్​ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మోదీ. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదితో 75 ఏళ్లు అవుతుందని తెలిపారు. దేశ స్వేచ్ఛ కోసం అసోం ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. నవ భారత్​ నిర్మాణంలో భాగంగా ఆత్మనిర్బర్ సాధన దిశగా ఇప్పుడు యువత ముందుకుసాగాలని సూచించారు.

ఇదీ చూడండి: రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా ఉంటోంది: సోనియా

Last Updated : Jan 22, 2021, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details