విద్యార్థిలోకమంతా ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం శ్రమించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగితే సత్ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఇటీవల ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించి టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్న టీం ఇండియాను ఇందుకు ఉదహరించారు.
' 'ఆత్మనిర్బర్ భారత్' కోసం విద్యార్థిలోకం శ్రమించాలి' - pm modi news today
అసోం తేజ్పుర్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. విద్యార్థి లోకమంతా ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం పరితపించాలని పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా గడ్డపై విజయదుందుబి మోగించిన టీమ్ ఇండియాను ప్రశంసించారు. పాజిటివ్ ఆలోచనలో ముందుకు సాగితే సానుకూల ఫలితాలు వస్తాయనేందుకు ఈ విజయం నిదర్శనమన్నారు.
![' 'ఆత్మనిర్బర్ భారత్' కోసం విద్యార్థిలోకం శ్రమించాలి' Students must strive to create 'Atmanirbhar Bharat'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10334627-thumbnail-3x2-img.jpg)
'ఆత్మనిర్బర్ భారత్ సాధన కోసం విద్యార్థిలోకం శ్రమించాలి'
అసోం తేజ్పుర్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదితో 75 ఏళ్లు అవుతుందని తెలిపారు. దేశ స్వేచ్ఛ కోసం అసోం ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. నవ భారత్ నిర్మాణంలో భాగంగా ఆత్మనిర్బర్ సాధన దిశగా ఇప్పుడు యువత ముందుకుసాగాలని సూచించారు.
ఇదీ చూడండి: రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా ఉంటోంది: సోనియా
Last Updated : Jan 22, 2021, 1:09 PM IST