తెలంగాణ

telangana

ETV Bharat / bharat

​​​​​​​'ప్రధాని ఇలా, హోంమంత్రి అలా.. ఎవరిని నమ్మాలి?' - జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బంగాల్​ సీఎం మమతా బెనర్జీ కోల్​కతాలో మరో భారీ ర్యాలీ నిర్వహించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్​ఆర్​సీలపై మోదీ, షాలు తలా ఓ మాట చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా ఝార్ఖండ్ ప్రజలు భాజపాకు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు దీదీ. దేశంలో పలు ప్రాంతాల్లో నేడూ సీఏఏ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి.

Students from various universities across Delhi join march; Modi, Shah statements on nationwide NRC contradictory cm Mamata benarjee in kolkata
​​​​​​​'ప్రధాని ఇలా, హోంమంత్రి అలా.. ఎవరిని నమ్మాలి?'

By

Published : Dec 24, 2019, 3:30 PM IST

Updated : Dec 24, 2019, 9:19 PM IST

కోల్​కతాలో దీదీ భారీ ర్యాలీ..

పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు అక్కడక్కడా కొనసాగుతూనే ఉన్నాయి. దిల్లీ, పశ్చిమ్​ బంగా​, కర్ణాటకల్లో నిరసనలు కనిపించాయి.

మరో ర్యాలీతో దీదీ!

బంగాల్​లో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి సీఏఏ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. కోల్​కతా బిధాన్​ సరణిలోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి, గాంధీ భవన్​ వరకు సాగిన ఈ నిరసన ప్రదర్శనకు దీదీ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా.. కేంద్రంపై మండిపడ్డారు మమత బెనర్జీ. భాజపా, సీఏఏ, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎన్​ఆర్​సీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఒకటి చెబితే, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా మరొకటి చెబుతున్నారని విమర్శించారు దీదీ. ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు.

"దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ అమలుపై చర్చలే లేవు, అలాంటి ప్రతిపాదనే లేదని ప్రధాని అంటున్నారు. కానీ, కొద్ది రోజుల క్రితం హోం మంత్రి మాత్రం దేశమంతా ఎన్​ఆర్​సీ అమలవుతుందన్నారు. వీరిద్దరి వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వీరిలో ఎవరు నిజం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు."
-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

ఝార్ఖండ్​ ప్రజలు ఎన్నికల్లో ఓడించి భాజపాకు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. దేశాన్ని విభజించాలని భాజపా బలంగా ప్రయత్నిస్తోందని... కానీ భారత ప్రజలు వారి ప్రయత్నాల్ని నెరవేరనీయరని ఆమె తెలిపారు.

ఏకమైన విద్యార్థి గళాలు..

దిల్లీ జంతర్​మంతర్​ వద్ద జరుగుతున్న నిరసనల్లో అనేక విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు భాగస్వాములవుతున్నారు. 'హల్లా బోల్'​(గళం వినిపించండి), 'ఛాత్రా ఏక్తా జిందాబాద్​'(విద్యార్థుల ఐకమత్యం జిందాబాద్)​ అనే నినాదాలు మారుమోగాయి.

జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం, జామియా మిలియా ఇస్లామియా, దిల్లీ యూనివర్సిటీల నుంచి విద్యార్థులు ఉమ్మడిగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మండీ హౌస్​ నుంచి జంతర్​మంతర్​ వరకు సాగింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే సెక్షన్​ 144 అమలు చేశారు పోలీసులు. కర్ణాటక హుబ్లీలోనూ నిరసనలు హోరెత్తాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:రాహుల్​, ప్రియాంకను అడ్డుకున్న మేరఠ్ పోలీసులు

Last Updated : Dec 24, 2019, 9:19 PM IST

ABOUT THE AUTHOR

...view details