కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం విధించిన 3 రోజుల లాక్డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. దుకాణాలు మూతపడ్డాయి. నగరాల్లో ప్రజల రాకపోకలను నియంత్రిస్తూ పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఎడారిలా..
జులై 10 రాత్రి 10 గంటలకు ప్రారంభమైన లాక్డౌన్ 50 గంటలకుపైగా కొనసాగి జులై 13 ఉదయం 5 గంటలకు ముగియనుంది. లాక్డౌన్ వల్ల జన సంచారం పూర్తిగా స్తంభించింది. దీనితో రాష్ట్రంలోని పలు నగరాలు ఎడారిని తలపిస్తున్నాయి.
నిత్యవసరాలు మాత్రమే
లాక్డౌన్ విధించినప్పటికీ.. నిత్యవసరాలైన పాలు, పండ్లు, కూరగాయలు సహా ఇతర కిరాణా వస్తువులు అమ్మే షాపులకు మాత్రం అనుమతి ఇచ్చారు. మిగతా దుకాణాలు మూతపడ్డాయి. జనం కూడా ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప గడపదాటి బయటకు రావడంలేదు.