తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వందే భారత్​ 2.0: 31 దేశాలు- 149 విమానాలు - Stranded Indians

కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం తీసుకొచ్చే వందే భారత్​ మిషన్ రెండో విడత మే 16న ప్రారంభమవుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. 31 దేశాల నుంచి 149 విమానాల్లో వేలాది మందిని తీసుకురానున్నట్లు పేర్కొన్నాయి.

2nd phase of 'Vande Bharat Mission'
వందే భారత్​ మిషన్​

By

Published : May 12, 2020, 7:57 PM IST

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు మే 7న 'వందే భారత్​ విషన్​'ను ప్రారంభించింది కేంద్రం. ఇప్పుడు రెండో విడతను మే 16నుంచి ప్రారంభించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఏఏ దేశాల నుంచి?

వందే భారత్​ మిషన్​-2లో భాగంగా 31 దేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకురానుంది కేంద్రం. అమెరికా, కెనడా, ఒమన్​, కజకిస్థాన్​, ఉక్రెయిన్​, ఫ్రాన్స్​, తజికిస్థాన్, సింగపూర్, సౌదీ అరేబియా, ఇండోనేసియా, ఖతార్​, రష్యా, కిర్జిస్థాన్​, జపాన్, కువైట్​, ఇటలీ, నేపాల్, నైజీరియా, బెలారస్, అర్మేనియా, థాయ్​లాండ్, ఐర్లాండ్​, జర్మనీ, జార్జియా, బ్రిటన్​ సహా ఇతర దేశాల నుంచి భారతీయులను తీసుకురానుంది.

ఎన్ని విమానాలు?

మొత్తం 149 విమానాల్లో భారతీయులను స్వదేశానికి తరలించనున్నారు అధికారులు. ఎయిర్​ ఇండియా, ఎయిర్ ఎక్స్​ప్రెస్​ సేవలను వినియోగించుకోనున్నారు.

ఎన్ని రోజులు?

మే 16 నుంచి వారం రోజుల పాటు(మే 22వరకు) వందే భారత్ మిషన్​-2ను నిర్వహించనున్నారు.

ఎవరికి ప్రాధాన్యం?

విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు, గర్భిణిలు, వీసా గడువు ముగిసిన వారు, విద్యార్థులు, ఆరోగ్య సమస్యలున్నవారు, వృద్ధులకు ప్రాధాన్యం.

వందే భారత్​ మిషన్-1​లో ఎంత మంది?

12 దేశాల నుంచి 64 విమానాల ద్వారా 15వేల మంది భారతీయులను తీసుకురావాలని భావించింది కేంద్రం. గల్ఫ్ దేశాలు సహా, అమెరికా, బ్రిటన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్​, మలేషియా, మాల్దీవుల నుంచి 6,527మందిని విషన్​-1లో స్వేదేశానికి తరలించింది.

విదేశాల నుంచి భారత్​ వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో మొత్తం 68,000 మందికి అర్హత ఉన్నట్లు గతవారం తెలిపింది కేంద్రం.

ABOUT THE AUTHOR

...view details