" గోవా నుంచి ప్రభుత్వం కనిపించకుండా పోయినట్లుగా... కేంద్ర ప్రభుత్వం రఫేల్ పత్రాలు చోరీకి గురయ్యాయని చెప్పింది. రఫేల్ పత్రాలు తనవద్దే ఉన్నాయని కేబినెట్ భేటీలో పారికర్ స్పష్టంగా చెప్పారు. ఆడియో టేపులు కూడా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తనని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించలేరని పారికర్ అన్నారు. తొలగించిన రోజున రఫేల్ పత్రాలను బయటపెడతానని స్పష్టం చేశారు. అందుకే దర్యాప్తు చేపట్టాలనుకుంటే పారికర్ నుంచే మొదలెట్టండి"
"పారికర్ నుంచే దర్యాప్తు ప్రారంభించండి" - Parrikar
రఫేల్ ఒప్పంద పత్రాలు చోరీకి గురవటంపై విచారణ జరపించాలని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. అప్పటి రక్షణమంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నుంచే దర్యాప్తును ఆరంభించాలని సూచించారు. రఫేల్ ఒప్పంద పత్రాలు తనవద్దే ఉన్నాయని కేబినేట్ సమావేశంలో పారికర్ పేర్కొన్నట్లు రాహుల్ తెలిపారు.
!["పారికర్ నుంచే దర్యాప్తు ప్రారంభించండి"](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2644560-834-da0a4a8e-e543-4074-8caf-a5d138b20453.jpg)
రఫేల్ పత్రాలపై దర్యాప్తును పారికర్ నుంచే ప్రారంభించాలని రాహుల్ డిమాండ్
రఫేల్ పత్రాలపై దర్యాప్తును పారికర్ నుంచే ప్రారంభించాలని రాహుల్ డిమాండ్
- రాహుల్ గాంధీ, కాం గ్రెస్ పార్టీ అధ్యక్షులు.
Last Updated : Mar 9, 2019, 7:41 AM IST