తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదు రోజుల భారత​ పర్యటనలో శ్రీలంక ప్రధాని - Mahinda Rajapaksa

ఐదు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స భారత్​ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమస్యలపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించనున్నారు.

sri-lankan-pm-mahinda-rajapaksa-arrives-in-india-on-five-day-visit
ఐదు రోజుల పర్యటనకు భారత్​ చేరుకున్న రాజపక్స

By

Published : Feb 7, 2020, 9:45 PM IST

Updated : Feb 29, 2020, 1:55 PM IST

శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స ఐదు రోజులపాటు భారత్​ పర్యటించేందుకు దిల్లీకి చేరుకున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీతో చర్చించనున్నారు. దేశంలోని వారణాసి, సార్​నాథ్​, బోధ్​గయ, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలను లంక ప్రధాని ఈ పర్యటనలోనే సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఐదు రోజుల భారత​ పర్యటనలో శ్రీలంక ప్రధాని

శ్రీలంకలోని తమిళ సమాజానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, హిందూ మహా సముద్రం ప్రాంతంలోని పరిస్థితులు, ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇతర సమస్యలపై ప్రధానితో చర్చించనున్నారు రాజపక్స. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజపక్స భారత్​కు రావటం ఇది రెండోసారి. గతేడాది నవంబరులో ఇదివరకే భారత్​లో పర్యటించారు లంక ప్రధాని.

ఇదీ చూడండి: అధికారులు పట్టించుకోలేదని రోడ్డుపైనే స్నానం!

Last Updated : Feb 29, 2020, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details