తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసులపై ఉగ్రవాదుల కాల్పులు- ఒకరు మృతి - జమ్ముకశ్మీర్ వార్తలు

జమ్ము కశ్మీర్ కిష్తవాడ్ జిల్లాలో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక అధికారి మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

JK-ATTACK
పోలీసులపై ఉగ్రవాదుల కాల్పులు

By

Published : Apr 13, 2020, 5:29 PM IST

జమ్ముకశ్మీర్​లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కిష్తవాడ్ జిల్లా తండార్ గ్రామంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు ప్రత్యేకాధికారి చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు ప్రత్యేకాధికారులపై ఇవాళ మధ్యాహ్నం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వారి వద్ద నుంచి రెండు సర్వీసు రైఫిళ్లను ఎత్తుకెళ్లారు.

దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:వందల కిలోమీటర్లు ప్రయాణించిన జవాన్​.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details