తెలంగాణ

telangana

కరోనా విజృంభణ: 64,553 కేసులు, 1007 మరణాలు

By

Published : Aug 14, 2020, 9:42 AM IST

Updated : Aug 14, 2020, 10:42 AM IST

దేశంలో కొవిడ్ వ్యాప్తి తీవ్రమవుతోంది. కొత్తగా 64,553 మంది మహమ్మారి బారినపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24లక్షల 61వేల 191కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2 కోట్ల 76 లక్షల 94 వేల కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రికవరీలు, మరణాల రేటు గణనీయంగా తగ్గుముఖం పడుతోంది.

INDIA CASES
కరోనా

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజువారీ సగటు కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 64,553 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 1007 మంది మరణించినట్లు తెలిపింది.

దేశంలో కరోనా కేసుల వివరాలు

మరోవైపు రికవరీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొత్తం బాధితుల్లో 71.17 శాతం మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. అదేసమయంలో మరణాల రేటు సైతం తగ్గుముఖం పడుతోంది. తాజాగా ఈ రేటు 1.95 శాతానికి పడిపోయింది.

గురువారం ఒక్కరోజే 8,48,728 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 2,76,94,416కు చేరింది.

ఇదీ చదవండి-కశ్మీర్​: పోలీసులపై ఉగ్రదాడి- ముగ్గురు మృతి

Last Updated : Aug 14, 2020, 10:42 AM IST

ABOUT THE AUTHOR

...view details