తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆజాద్​ రాజ్యసభ సీటుకు గండం.. కారణమిదే!

రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్​ సీనియర్​ నేత గులామ్​ నబీ ఆజాద్ పదవీకాలం​ గడువు 2021 ఫిబ్రవరితో ముగయనుంది. అయితే ఆయన తిరిగి పెద్దల సభ మెట్లు ఎక్కడం ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్​లో అలజడి సృష్టించిన లేఖ వ్యవహారంలో ఆజాద్​ పేరు బలంగా వినపడిన కొద్ది రోజులకు.. ఆయన రాజ్యసభ భవితవ్యంపై ఉహాగానాలు జోరందుకోవడం గమనార్హం.

By

Published : Aug 31, 2020, 11:02 PM IST

Speculation over Azad’s future as RS term ends Feb ’21
ఆజాద్​ రాజ్యసభ సీటుకు గండం.. కారణమిదే!

రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత గులామ్​ నబీ ఆజాద్​ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్​లో 'లేఖ' వ్యవహారంపై అంతర్గత యుద్ధం జరిగిన కొద్ది రోజులకే.. దీనిపై ఊహాగానాలు జోరందుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

రాజ్యసభలో ఆజాద్​ పదవీకాలం 2021 ఫిబ్రవరి 15తో ముగియనుంది. పెద్దల సభకు ఆజాద్​ మరోమారు ఎన్నికవ్వడం దాదాపు అసాధ్యమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే పుదుచ్చెరిలో సీటు మాత్రమే ఆజాద్​కు ఉన్న ఏకైక అవకాశంగా కనపడుతోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే ఎంపీ ఎన్​ గోపాలకృష్ణన్​ ఉన్న ఆ స్థానం 2021అక్టోబర్​లో ఖాళీ కానుంది. ఇందులోను ఇంకో చిక్కు ఉంది. వచ్చే ఏడాది మేలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో గెలిచి కాంగ్రెస్​ తిరిగి అధికారం చేపడితేనే ఆ సీటు ఆజాద్​ను వరిస్తుంది.

ఇదీ చూడండి:-'కాంగ్రెస్‌ వాదులైతే లేఖను స్వాగతిస్తారు'

ఇది జరగకపోతే.. 2022మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల వరకు ఆజాద్​ పెద్దల సభ మెట్లు ఎక్కలేకపోవచ్చు.

జమ్ముకశ్మీర్​లో ఈసారి కష్టమే...!

జమ్ముకశ్మీర్​ నుంచి ఆజాద్​ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019లో కేంద్రం జమ్ముకశ్మీర్​ను కేంద్ర పాలితప్రాంతంగా విభజించింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీనిచ్చారు. కానీ 2021మార్చి వరకు అది సాధ్యపడేలా కనపడటం లేదు.

2015లో నేషనల్​ కాన్ఫరెన్స్​ చట్టసభ్యుల మద్దతుతో పెద్దల సభకు చేరారు ఆజాద్​. కానీ ఈసారి వారి నుంచి మద్దతు లభించడం ప్రశ్నార్థకమే.

ఇతర రాష్ట్రాల్లోనూ...

ప్రస్తుతం పంజాబ్​, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​లో కాంగ్రెస్​ అధికారంలో ఉంది. అయితే ఇక్కడ ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలు జరిగిపోయాయి.

కర్ణాటక, మధ్యప్రదేశ్​, గుజరాత్​లో ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్​. ఇక్కడ కాంగ్రెస్​ చట్టసభ్యులు సరిపడా ఉన్నప్పటికీ.. ఈ రాష్ట్రాల్లో కూడా రాజ్యసభ ఎన్నికలు జరిగిపోయాయి.

మరోవైపు శివసేన-ఎన్​సీపీ-కాంగ్రెస్​ పాలిస్తున్న మహారాష్ట్రలోనూ పెద్దల సభకు ఎన్నికలు అయిపోయాయి.

కాంగ్రెస్​లో కలకలం సృష్టించిన లేఖ వ్యవహారంలో ఆజాద్​ పేరు వినిపించడానికి.. ఆయన పెద్దల సభకు తిరిగి చేరలేరన్న ఊహాగానాలకు సంబంధం లేనప్పటికీ... ఉన్న ఆప్షన్లను పరిశీలిస్తే.. ఆజాద్​కు ఈసారి సీటు దక్కడం కష్టమేనని పార్టీ అంతర్గత వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఆ పదవిని అందుకునేదెవరు?

రాజ్యసభలో ఆజాద్​ ప్రస్తుతం ప్రతిపక్ష సభాపక్ష నేతగా ఉన్నారు. ఆయన పదవీకాలం ముగిస్తే.. ఆ బాధ్యతను ఎవరు చేపడతారనే చర్చ కూడా మొదలైంది. నిజానికి సీనియారిటీ ప్రకారం ఇది ఆనంద్​ శర్మకు చేరాలి. కానీ 'లేఖ' రాసిన వారిలో ఆయనకూడా ఉండటం వల్ల ఆనంద్​కు అవకాశాలు తక్కువని పార్టీ అంతర్గత వ్యక్తులు చెబుతున్నారు. సోనియా విధేయుడు మల్లిఖార్జున ఖర్గేకు ఈ బాధ్యతలు చేరే అవకాశముందని వారు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:-నాయకత్వ సంక్షోభం.. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్​

ABOUT THE AUTHOR

...view details