తెలంగాణ

telangana

'రాముడిని నిత్యం స్మరించే భాజపా నిజం చెప్పాలి'

By

Published : Oct 28, 2019, 10:00 PM IST

మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యమంత్రి పీఠాన్ని చెరి సగం పంచుకోవాలని శివసేన డిమాండ్​ చేయడమే ఇందుకు కారణం. తాజా పరిణామాలపై శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ స్పందించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై అమిత్​ షా- ఉద్ధవ్​ ఠాక్రే మధ్య ఒప్పందం జరిగిందని.. దీనిపై భాజపా సత్యం మాట్లాడాలని డిమాండ్​ చేశారు.

'రాముడిని నిత్యం స్మరించే భాజపా నిజం చెప్పాలి'

మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపాకు పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడం.. మిత్రపక్షం శివసేనపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో సగం పదవీకాలం పంచుకోవాలంటూ డిమాండ్​ చేయడం మరాఠా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొనేందుకు కారణమైంది.

ఈ నేపథ్యంలో తమ డిమాండ్​ను సమర్థించుకుంది శివసేన. భాజపా అధ్యక్షుడు అమిత్​ షా- తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే మధ్య ఒప్పందం(ముఖ్యమంత్రి పీఠాన్ని చెరి సగం పదవీకాలం పంచుకోవాలి) కుదిరిందని.. ఈ విషయంపై భాజపా సత్యం మాట్లాడాలని శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ కోరారు.

"రాముడిని భాజపా నిత్యం స్మరిస్తుంది. రామ మందిరాన్ని నిర్మించేది భాజపానే. సత్యానికి నిదర్శనం రాముడు. కాషాయ దళం దీనిపై(ముఖ్యమంత్రి పదవి) సత్యం మాట్లాడాలి. కాగితాన్ని చింపగలరు.. కానీ రికార్డులను తొలగించలేరు."
--- సంజయ్​ రౌత్​, శివసేన ఎంపీ.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​, శివసేన సీనియర్​ నేత దివాకర్​ రౌటే.. గవర్నర్​ను సోమవారం విడివిడిగా కలిశారు. ఇది జరిగిన కొద్ది సమయం తర్వాతే ... భాజపా సత్యం మాట్లాడాలంటూ డిమాండ్​ చేశారు రౌత్​.

ABOUT THE AUTHOR

...view details