తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎస్పీ నేతను అపహరించి హత్య చేసిన నక్సల్స్

ఛత్తీస్​గఢ్​ బిజాపుర్​ జిల్లాలో సమాజ్​వాదీ పార్టీ నేతను హత్య చేశారు మావోయిస్టులు. నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ఎస్పీ నేత సంతోష్​ పూణెమ్​ను అపహరించిన నక్సల్స్​ ఆ తర్వాత కాల్చి చంపారు.

By

Published : Jun 20, 2019, 7:57 AM IST

Updated : Jun 20, 2019, 9:37 AM IST

ఛత్తీస్​గఢ్​లో మావోల ఘాతుకం

ఛత్తీస్​గఢ్​లో మావోల ఘాతుకం

ఛత్తీస్​గఢ్​లో నక్సల్స్​ మరో ఘాతుకానికి ఒడిగట్టారు. సమాజ్​వాదీ పార్టీ నేత సంతోష్ పూణెమ్​ను అపహరించి హత్య చేసి మరిమల్ల కొండ ప్రాంతంలో పడేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న సంతోష్​ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంతోష్​ కాంట్రక్టర్​గా పనిచేస్తున్నారు. ఓ రోడ్డు సంబంధిత పనులను పరిశీలించేందుకు వెళ్లిన సంతోష్​ను మావోలు అపహరించారు.

ఛత్తీస్​గఢ్​లో గతేడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో బిజాపుర్​ స్థానం నుంచి సమాజ్​వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు సంతోష్.

ఇదీ చూడండి: పెళ్లింట తీవ్ర విషాదం- 8 మంది మృతి

Last Updated : Jun 20, 2019, 9:37 AM IST

ABOUT THE AUTHOR

...view details