ఛత్తీస్గఢ్లో నక్సల్స్ మరో ఘాతుకానికి ఒడిగట్టారు. సమాజ్వాదీ పార్టీ నేత సంతోష్ పూణెమ్ను అపహరించి హత్య చేసి మరిమల్ల కొండ ప్రాంతంలో పడేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న సంతోష్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంతోష్ కాంట్రక్టర్గా పనిచేస్తున్నారు. ఓ రోడ్డు సంబంధిత పనులను పరిశీలించేందుకు వెళ్లిన సంతోష్ను మావోలు అపహరించారు.