తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2019, 5:56 PM IST

Updated : Apr 18, 2019, 6:21 PM IST

ETV Bharat / bharat

మొన్న కమలం.. నిన్న హస్తం.. నేడు సైకిల్​

ఇటీవలే కాంగ్రెస్​లో చేరిన శత్రఘ్నసిన్హా సతీమణి పూనమ్ సిన్హా సమాజ్​వాదీ పార్టీ తరఫున లఖ్​నవూ స్థానానికి నామినేషన్ వేశారు. కాంగ్రెస్​లో చేరినా.. శత్రఘ్న సిన్హా తన భార్య పూనమ్​ రోడ్​ షోలో పాల్గొని ప్రచారం చేయటం విశేషం. ఎస్పీ అధినేత అఖిలేష్ ఆజంగడ్​ నుంచి నామినేషన్ వేశారు.

మొన్న కమలం.. నిన్న హస్తం.. నేడు సైకిల్​

మొన్న కమలం.. నిన్న హస్తం.. నేడు సైకిల్​

శత్రుఘ్న సిన్హా... బాలీవుడ్​ షాట్​గన్​. కొద్దిరోజుల క్రితం వరకు భాజపా సభ్యుడు. ఇటీవలే కాంగ్రెస్​లో చేరారు. ఈరోజు సమాజ్​వాదీ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

భార్య కోసం...

శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్​ సిన్హా... మంగళవారం సమాజ్​వాదీ పార్టీలో చేరారు. నేడు లఖ్​నవూ స్థానానికి ఎస్పీ-బీఎస్పీ-ఆర్​ఎల్డీ అభ్యర్థిగా నామినేషన్​ వేశారు. అనంతరం భారీ రోడ్​షో నిర్వహించారు. ఎస్పీ నేత డింపుల్​ యాదవ్​ సహా మరికొందరు పాల్గొన్న ఈ కార్యక్రమంలో... కాంగ్రెస్​ నేత శత్రుఘ్న సిన్హా పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.

లఖ్​నవూ నుంచి భాజపా తరఫున కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పోటీ చేస్తున్నారు.

ఆజంగడ్​ స్థానానికి అఖిలేశ్​ నామినేషన్​

సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ ఉత్తర్​ప్రదేశ్​ ఆజంగడ్​ లోక్​సభ స్థానానికి నామినేషన్​ దాఖలు చేశారు. ఆయన వెంట బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్​ చంద్ర మిశ్రా హాజరయ్యారు. తన ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు అఖిలేశ్​. ఆజంగడ్​ను సమాజ్​వాదీకి కర్మభూమిగా పేర్కొన్నారు.

ఇదీ చూడండీ: 'తీవ్రవాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాం'

Last Updated : Apr 18, 2019, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details