తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మెజారిటీ ఉందని ప్రజలను రాజీవ్​ భయపెట్టలేదు'

రాజీవ్​గాంధీ 75వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీపై పరోక్షంగా నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ. 1984 లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ కూడా పూర్తి మెజారిటీతో గెలిచారని, ఆయనెప్పుడూ తన అధికారాన్ని భయపెట్టేందుకు, ప్రజల స్వేచ్ఛను హరించేందుకు ఉపయోగించలేదన్నారు.

By

Published : Aug 22, 2019, 10:59 PM IST

Updated : Sep 27, 2019, 10:31 PM IST

సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

ప్రధాని నరేంద్రమోదీ, ఎన్డీయే ప్రభుత్వ పేరును ప్రస్తావించకుండా పరోక్ష విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన సోనియా.. ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

"1984లో రాజీవ్‌గాంధీ పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఆయనెప్పుడూ తన అధికారాన్ని భయపెట్టేందుకు వాడలేదు. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించేందుకు ఉపయోగించలేదు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసే చర్యలు ఎప్పుడూ చేపట్టలేదు. ఇప్పుడా విలువలను నాశనం చేయాలని చూస్తున్నవారిని ఎదుర్కోవాలి. భారత్​ ఆలోచనను మార్చేవారిని అడ్డుకోవాలి. విభజన శక్తులకు కాంగ్రెస్ ఎదురొడ్డి నిలబడుతుంది."

- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

ఇదీ చూడండి: ముూడు దేశాల పర్యటన: ఫ్రాన్స్​ చేరుకున్న మోదీ

Last Updated : Sep 27, 2019, 10:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details