కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో షీలా భౌతిక కాయం పార్టీ కార్యకర్తలు, నాయకుల సందర్శనార్థం దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పార్థివ దేహాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అభిమాన నేతను చూసేందుకు పార్టీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన షీలా దీక్షిత్ భౌతిక కాయానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పలువురు పార్టీ నేతలు నివాళులర్పించారు.
" షీలా నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. నాకు ఒక స్నేహితురాలే కాదు అక్క లాంటివారు. షీలా దీక్షిత్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆమెను నేను ఎప్పటికీ మరచిపోలేను."
-సోనియా గాంధీ, యూపీఏ ఛైర్పర్సన్.
ఇదీ చూడండి: పాశ్చాత్య సంగీతం, పాదరక్షలంటే షీలాకు ప్రీతి