తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నతల్లిపై అత్యాచారం.. ఆపై గొంతు నులిమి..

మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన కర్ణాటకలో జరిగింది. కన్న తల్లినే హత్యాచారం చేశాడు ఓ కర్కశ కొడుకు. ఈ నెల 12 జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

By

Published : Nov 15, 2020, 12:33 PM IST

Updated : Nov 15, 2020, 2:46 PM IST

Son raped and killed his Mother in Haveri
కన్నతల్లిపై అత్యాచారం.. ఆపై గొంతు నులిమి..కన్నతల్లిపై అత్యాచారం.. ఆపై గొంతు నులిమి..

అమానుషంగా ప్రవరిస్తున్న కొందరు వావివరసలు లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మృగాల కన్నా హీనంగా తయారవుతున్నారు. తాజాగా కర్ణాటక హవేరి జిల్లాలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. మానవ మృగంలా మారిన ఓ కొడుకు.. కన్న తల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే దారుణమనుకుంటే.. తల్లి అని కూడా ఆలోచించకుండా గొంతునులిమి చంపేశాడు ఆ కీచకడు.

శివప్ప లామణి అనే వ్యక్తి ఈ నెల 12న తల్లిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడు. పోలీసుల చొరవతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ దారుణం.

మృతురాలి భర్త ఆరేళ్ల క్రితం మరణించగా.. కొడుకు శివప్పతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన శివప్ప... తల్లిపై కోపంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడనిపోలీసులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత రోజు శవాన్ని గుర్తించిన పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఇద్దరు యువతులపై ఆరుగురి అత్యాచారం

Last Updated : Nov 15, 2020, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details