తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​ గెలుస్తోందని విపక్షాలకు అక్కసు' - కాంగ్రెస్​

దేశం సాధించిన విజయాలపై ప్రజలు సంతోషంగా ఉంటే కొందరు మాత్రం నిరాశలో ఉన్నారని ప్రతిపక్షాలను విమర్శించారు నరేంద్ర మోదీ.

"దేశ విజయాలపై కొందరు నిరాశలో ఉన్నారు"

By

Published : Mar 30, 2019, 1:06 PM IST

"దేశ విజయాలపై కొందరు నిరాశలో ఉన్నారు"

అరుణాచల్​ ప్రదేశ్​ ఆలోలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశం సాధిస్తోన్న విజయాల పట్ల నిరాశగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

ఈశాన్య భారతంలో కమల వికాసం అరుణాచల్​ నుంచే ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు.

"మా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశలతో గౌరవించారు. స్వాతంత్ర్యం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత అరుణాచల్​ను రైల్వే పటంలో చేర్చే అవకాశం కాపలాదారుకు దక్కింది."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ABOUT THE AUTHOR

...view details