తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో పాక్​ కాల్పులు..సైనికుడు మృతి - LoC in Kupwara latest news

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో భారత సైనికుడు ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు.

Soldier killed, 2 others injured along LoC in Kupwara
సరిహద్దులో పాక్​ కాల్పులు.. ఒక సైనికుడు మృతి, ఇద్దరికి గాయాలు

By

Published : Sep 5, 2020, 8:25 PM IST

సరిహద్దు వెంట పాకిస్థాన్​ దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మరోసారి భారత దళాలపై కాల్పులకు తెగబడింది. ఉత్తర కశ్మీర్​లోని కుప్వారా జిల్లా నౌగాం సెక్టార్​లోని నియంత్రణ రేఖ వద్ద ఈ ఘటన జరిగింది. పాక్​ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు భారత సైన్యం వెల్లడించింది. అయితే ఇరువర్గాల మధ్య పోరులో ఒక భారత జవాను వీరమరణం పొందగా.. ఇద్దరు గాయపడ్డారు.

నౌగాం సెక్టార్​లోని పోస్టులే లక్ష్యంగా పాక్​ సైనికులు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు ఆర్మీ అధికారులు. మరణించిన జవాను భూపేందర్​ సింగ్ కాగా.. లాన్సే నాయక్​ వెంకటేశ్, సిపాయి షజల్​ గాయపడినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details