మహారాష్ట్ర సోలాపుర్లో లాక్డౌన్ కారణంగా చిక్కుకున్న వలసకార్మికుల కోసం.. 'శ్రామిక్' రైలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గ్వాలియర్ వెళ్లేందుకు వందల మంది అందులో ఎక్కి కూర్చున్నారు. అయితే రైలు బయలుదేరే ముందు ఓ సంఘటన జరిగింది. మహిళ, 4 నెలల చిన్నారిని ఎత్తుకొని రైల్వే ట్రాక్పై పరిగెడుతూ కనిపించింది. వెంటనే రైలును అధికారుల అనుమతితో కొద్ది నిమిషాలు నిలిపేశాడు లోకో పైలట్. ప్రస్తుతం ఈ వీడియో వీక్షకుల మనసులను కదిలిస్తోంది. ఇంతకీ జరిగిందేంటి?
పట్టాలపై పసిబిడ్డతో మహిళ.. 10 నిమిషాలు ఆగిన రైలు - shamik train latest news updates
మహరాష్ట్ర సోలాపుర్ నుంచి గ్వాలియర్కు వలసకార్మికుల కోసం ప్రత్యేక రైలు వేశారు అధికారులు. ట్రైన్ కదిలే సమయంలో ఓ మహిళ, నాలుగు నెలల చిన్నారిని ఎత్తుకొని ట్రాక్పై పరిగెత్తుతూ కనిపించింది. ఆమెను చూసి డ్రైవర్..10 నిమిషాలు రైలును నిలిపేశాడు.
రైల్వే ట్రాక్పై 4నెలల చిన్నారితో మహిళ.. కారణం ఇదే!
రవాణా ఇబ్బందులు...
రైలును చేరుకోడానికి సమయానికి రవాణా సదుపాయం లేక.. బిడ్డను మోసుకుంటూ రైల్వేట్రాక్పై నడస్తూ వచ్చింది ఓ మహిళ. దూరం నుంచే ఆమెను గమనించిన రైల్వే అధికారులు.. వెంటనే స్పందించి రైలును 10 నిమిషాలు నిలిపేశారు. ఆమె ఫ్లాట్ఫాం వద్దకు రాగానే.. అక్కడే ఉన్న ఓ ఫొటో జర్నలిస్ట్ పసిబిడ్డను తీసుకొని మహిళ రిజర్వ్ చేసుకున్న బోగి వరకు సాయం చేశాడు. ఇద్దరినీ రైలు ఎక్కించాడు. ఘటనా స్థలంలో ఉన్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఇదంతా చూసి భావోద్వేగమయ్యారు.
Last Updated : May 18, 2020, 7:59 PM IST