మాజీ ఐఏఎస్ అధికారి, కర్ణాటక ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి రత్నప్రభ భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు రత్నప్రభ. దేశ సేవ చేయడానికి భాజపాలో చేరడమే సరైన మార్గమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.
భాజపాలోకి కర్ణాటక విశ్రాంత సీఎస్ రత్నప్రభ - రత్నప్రభ
కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ భాజపాలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుపరిపాలన చూసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
![భాజపాలోకి కర్ణాటక విశ్రాంత సీఎస్ రత్నప్రభ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2896946-157-0576426e-1367-487c-9e39-4535b3a1d7e3.jpg)
భాజపాలో చేరిన కర్ణాటక విశ్రాంత సీఎస్
గతేడాది జూన్లో ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ పొందారు రత్నప్రభ. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో రత్నప్రభకు మంచి గుర్తింపు ఉంది. ఆ ప్రాంతంలో వివిధ పదవుల్లో గతంలో ఆమె విధులు నిర్వర్తించారు. రాయచూరు జిల్లాకు మొట్టమొదటి మహిళా కలెక్టర్గా పనిచేశారు.
రత్నప్రభ 1981 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి. కర్ణాటకకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మహిళా అధికారిణుల్లో రత్న మూడోవారు.