తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'​స్పైవేర్​పై సమాధానమిచ్చే నిజాయతీ ప్రభుత్వానికి లేదు' - స్పైవేర్​పై సమాధానం ఇవ్వటానికి ప్రభుత్వానికి నిజాయతీ లేదు

ఇజ్రాయెల్​కు చెందిన పెగసస్​ స్పైవేర్​ ద్వారా​ వాట్సప్​లో పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తల సమాచారం చోరీకి గురికావటంపై రాజకీయ దుమారం చేలరేగింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్​. స్పైవేర్​కు సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిజాయతీ లేని ప్రభుత్వం నిరాకరిస్తోందని ఆరోపించింది.

​స్పైవేర్​పై సమాధానం ఇవ్వటానికి ప్రభుత్వానికి నిజాయతీ లేదు

By

Published : Nov 2, 2019, 11:00 PM IST

వాట్సప్​ ద్వారా పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తల సమాచారం చోరీకి గురైన వ్యవహారంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్​. అక్రమ స్పైవేర్​ను ఎవరు కొనుగోలు చేశారు? ఎవరు వినియోగించారు? వంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిజాయతీ లేని ప్రభుత్వం నిరాకరిస్తోందని ఆరోపించింది.

సమాచార భద్రతకు సంబంధించిన సమస్యను మే నెలలో వాట్సాప్ పరిష్కరించి... ఆ సంస్థ విషయాన్ని భారత, అంతర్జాతీయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా.

సుర్జేవాలా ట్వీట్​

" వాట్సాప్​ స్పైగేట్​కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమివ్వటానికి ఒక నిజాయతీ లేని ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఆ ప్రశ్నలు 1. భారత ప్రభుత్వంలో ఎవరు అక్రమ స్పైవేర్​ను కొనుగోలు చేసి వినియోగించారు? 2. ఎవరు దాని కొనుగోలుకు అధికారం ఇచ్చారు? 3. 2019, మేలోనే భారత ప్రభుత్వానికి ఫేస్​బుక్​ సమాచారం అందిస్తే.. ఎందుకు చర్యలు చేపట్టలేదు? 4.దోషులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? "

- రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి.

ఇజ్రాయెల్​ స్పైవేర్​..

ఇజ్రాయెల్‌కు చెందిన 'పెగసస్‌' అనే హానికర స్పైవేర్‌తో భారత్‌లోని కొందరు పాత్రికేయులు, మానవ హక్కుల కార్యకర్తలు సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,400 మంది ఫోన్లలోని సమాచారాన్ని చోరీ చేశారని వాట్సాప్​ ప్రకటించింది. టొరంటో విశ్వవిద్యాలయంలోని 'సిటిజన్‌ ల్యాబ్‌' అనే సైబర్‌ భద్రత ప్రయోగశాల సాయంతో ఈ దాడిని గుర్తించి, ఈ ఏడాది మేలోనే అడ్డుకున్నామని తెలిపింది.

దేశ పౌరుల సమాచార గోప్యతపై జరిగిన ఉల్లంఘనలకు వివరణ ఇవ్వాలని వాట్సప్​ను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 4లోపు కోట్లాది మంది భారతీయుల వ్యక్తిగత సమాచార గోప్యత పరిరక్షణకు తీసుకున్న చర్యలపై నివేదించాలని కోరింది.

ఇదీ చూడండి:'వర్షంలో తడిస్తేనే రాజకీయంలో మంచి భవిష్యత్తు'

ABOUT THE AUTHOR

...view details