కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్కు నిలిపివేసిన తపాలా సేవలను పునరుద్ధరించింది పాకిస్థాన్. భారత్ నుంచి వెళ్లే లేఖల పంపిణీపై నిషేధాన్ని ఎత్తేసింది. అయితే పార్శిల్ సేవలపై ఆంక్షలు కొనసాగుతాయని సమచారం.
ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్తో ద్వైపాక్షిక సంబంధాలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది పాక్. ఆగస్టులో తపాలా సేవలు, పాక్షికంగా వైమానిక సేవలను నిలిపేసింది దాయాది.