తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్రిక్తతల మధ్య దిల్లీ విద్యార్థులకు 'పరీక్ష' - delhi toll raises to 47

ఈశాన్య దిల్లీలో చెలరేగిన హింసలో మృతి చెందిన వారి సంఖ్య 47కు చేరింది. తాజాగా ఐదు మృతదేహాలు లభ్యం కాగా.. రామ్​ మనోహర్ లోహియా ఆసుపత్రిలో శవపరీక్షలు నిర్వహించారు. అదే సమయంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించారు.

delhi
47కు చేరిన మృతులు.. దిల్లీలో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు

By

Published : Mar 2, 2020, 5:06 PM IST

Updated : Mar 3, 2020, 4:29 AM IST

సీఏఏపై తీవ్ర ఘర్షణలకు వేదికైన ఈశాన్య దిల్లీలో ఆదివారం నుంచి ఇప్పటివరకు మరో 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య 47కు చేరింది. ఈశాన్య దిల్లీలోని పలు నాలాల్లో ఆదివారం 4 మృతదేహాలు లభ్యమవగా.. మరొకటి నేడు బయటపడింది. ఈ మృతదేహాలకు రామ్​ మనోహర్ లోహియా ఆసుపత్రిలో శవపరీక్షలు నిర్వహించారు.

అల్లర్ల ప్రభావం తీవ్రంగా ఉన్న జాఫ్రాబాద్, మౌజ్​పుర్, బాబర్​పుర్, చాంద్ భాగ్, శివ్​ విహార్, భజన్​పురాల్లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. తక్షణ సాయం అందించడానికి బాధితుల సమాచారాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.

పరీక్షల నిర్వహణ..

కట్టుదిట్టమైన భద్రత మధ్య విద్యార్థులు వార్షిక పరీక్షలు రాశారు. హాజరు 92 శాతంగా నమోదైంది. ఘర్షణల కారణంగా పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

'నివేదిక సమర్పించండి'

అల్లర్ల కారణంగా నష్టపోయిన బాధితులకు సాయం చేసేందుకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని దిల్లీ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. క్షతగాత్రులకు వైద్యం, పునరావాస చర్యలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఈ అంశమై తదుపరి విచారణను ఏప్రిల్ 30న చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది కోర్టు.

'పునరావాస చర్యలేవి?'

బాధితులకు సహాయం అందించడంలో కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు మానవ హక్కుల ఉద్యమకారులు. ఘర్షణలు చెలరేగిన ప్రాంతాల్లో ఆసుపత్రులు లేకపోవడంపై ఆక్షేపించారు. తూటాలు తగిలిన వారికి ప్రైవేటు వైద్య సదుపాయం అందించేందుకు పోలీసులు నిరాకరించడం వల్లే చికిత్సలు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నేతల విద్వేష ప్రసంగాల పిటిషన్​పై 4న విచారణ

Last Updated : Mar 3, 2020, 4:29 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details