తెలంగాణ

telangana

By

Published : Feb 29, 2020, 3:05 PM IST

Updated : Mar 2, 2020, 11:12 PM IST

ETV Bharat / bharat

ఇంకా భయం గుప్పిట్లోనే దిల్లీ ప్రజలు: కాంగ్రెస్

దిల్లీలో ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని కాంగ్రెస్​ ఆరోపించింది. ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, న్యాయస్థానంపైనే ఆశలు పెట్టుకున్నట్లు కాంగ్రెస్​ నేత ఆనంద్ శర్మ అన్నారు.

Situation in Delhi far from normal, environment of fear prevailing: Congress
ఇంకా భయం గుప్పిట్లోనే దిల్లీ ప్రజలు: కాంగ్రెస్

ఇంకా భయం గుప్పిట్లోనే దిల్లీ ప్రజలు: కాంగ్రెస్

దిల్లీలో సాధారణ పరిస్థితులు కనిపించడం లేదని కాంగ్రెస్​ అభిప్రాయపడింది. ప్రజలంతా భయం గుప్పిట్లోనే జీవిస్తున్నారని పేర్కొంది. అల్లర్లపై ఏకపక్ష దర్యాప్తు జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్​ నేత ఆనంద్​ శర్మ ఆరోపించారు.

కేంద్రం, దిల్లీ సీఎంపై ఎటువంటి నమ్మకం లేదని, న్యాయస్థానంపైనే ఆశలు పెట్టుకున్నట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా రాజధానిలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 43 మంది మరణించారు.

Last Updated : Mar 2, 2020, 11:12 PM IST

ABOUT THE AUTHOR

...view details