కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మీడియా సంస్థలపై మండిపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తానే తిరుగుబాటు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించినట్లు వచ్చిన కథనాలను ఖండించారు.
"మీడియా... ఇలాంటి తప్పుడు వార్తలను అరికట్టాలని హెచ్చరిస్తున్నా. మరోమారు నా ముందు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన రీతిలో సమాధానం ఇస్తా."
-సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతకర్ణాటక: మీడియాకు సిద్ధరామయ్య వార్నింగ్
నిజాలు నిలకడగా తెలుస్తాయ్
తిరుగుబాటు ఎమ్మెల్యేలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయని... అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని అన్నారు.