తెలంగాణ

telangana

By

Published : Jul 6, 2020, 8:31 AM IST

Updated : Jul 6, 2020, 10:28 AM IST

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా శ్రావణ మాస ప్రత్యేక పూజలు

దేశవ్యాప్తంగా శివాలయాల్లో శ్రావణ మాస ప్రత్యేక పూజలు జరిగాయి. ఉత్తర్​ప్రదేశ్ వారణాసి, గోరఖ్​పుర్, దిల్లీ, మధ్యప్రదేశ్​లోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ భక్తులు పూజాధికాలు నిర్వహించారు.

shrawan
దేశవ్యాప్తంగా శ్రావణ మాస ప్రత్యేక పూజలు

శ్రావణ మాసం తొలి సోమవారం వేళ దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. దిల్లీ చాందినీ చౌక్​లోని గౌరీశంకర్, బంఖండి మహాదేవ్ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నియంత్రణకు జాగ్రత్తలు పాటిస్తూ తమ ఇష్టదైవాన్ని ఆరాధించుకున్నారు భక్తులు.

దేశవ్యాప్తంగా శ్రావణ మాస ప్రత్యేక పూజలు
దిల్లీ గౌరీశంకర్ ఆలయంలో

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్​పుర్​లోని మానససరోవర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

గోరఖ్​పుర్ మానససరోవర్ ఆలయంలో యూపీ సీఎం యోగి

వారణాసి కాశీ విశ్వనాథుని ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.

వారణాసి కాశీ విశ్వనాథుని ఆలయంలో

మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో

ఇదీ చూడండి:'మరోసారి మిడతల దండయాత్ర.. జర జాగ్రత్త'

Last Updated : Jul 6, 2020, 10:28 AM IST

For All Latest Updates

TAGGED:

shiva puja

ABOUT THE AUTHOR

...view details