తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​లో సొంతూళ్లకు వెళ్లేందుకు 6 ప్రత్యేక రైళ్లు - shramik-special-trains-to-run-from-international-workers-day-on-may-1

sramik trains
కూలీలు, విద్యార్థుల కోసం నేటి నుంచే శ్రామిక్ రైళ్లు

By

Published : May 1, 2020, 4:59 PM IST

Updated : May 1, 2020, 6:14 PM IST

16:56 May 01

కూలీలు, విద్యార్థుల కోసం శ్రామిక్ రైళ్లు

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, పర్యటకులు, విద్యార్థుల కోసం 'శ్రామిక ప్రత్యేక రైళ్లు' నడపాలని కేంద్రం నిర్ణయించింది. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచే వీటిని ప్రారంభించింది కేంద్ర హోంశాఖ. లాక్​డౌన్​ వల్ల వేర్వేరు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారు స్వస్థలాలకు చేరుకునేలా.. రైలు సేవలు వినియోగించుకునేందుకు మార్గదర్శకాల్లో సవరణలు చేసింది. ఈ మేరకు అన్ని జోనల్​ మేనేజర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులు గమ్యస్థానాలు చేరేందుకు అధికారులు స్వయంగా వెళ్లి ఏర్పాట్లను పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని రైల్వే శాఖతో సంప్రదించాలని పేర్కొంది.

కేంద్రం ఆదేశాల్లోని మరిన్ని అంశాలు

  • వలస కార్మికులు ఏ రాష్ట్రంలో అయితే వారి ప్రయాణాన్ని మొదలు పెడతారో.. మొదటగా ఆ రాష్ట్రమే వారికి స్క్రీనింగ్​ నిర్వహించాలి
  • వైరస్​ నెగటివ్​గా వచ్చినవారిని మాత్రమే తమ స్వగ్రామాలకు ప్రయాణించేందుకు అనుమతివ్వాలి
  • ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం తప్పనిసరి
  • ప్రయాణికులకు ఆహారం, తాగు నీటి సౌకర్యాలను రైలు ఎక్కడైతే ప్రారంభమవుతుందో.. ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి
  • సుదూర ప్రయాణాలు చేసే వారికి జర్నీ మధ్యలో రైల్వే అధికారులు ఆహారం అందిస్తారు
  • గమ్యస్థానం చేరుకున్న తర్వాత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులందరికీ స్క్రీనింగ్​ నిర్వహించి.. అవసరమైతే క్వారంటైన్​ సౌకర్యలు ఏర్పాటు చేయాలి

మొత్తం 6 రైళ్లు...

తొలి శ్రామిక్ రైలు ఈ ఉదయమే 1200 మందితో లింగంపల్లి నుంచి హతియా వెళ్లింది. దీనితోపాటు మరో 5 రైళ్లు నడుపుతోంది రైల్వే శాఖ.

Last Updated : May 1, 2020, 6:14 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details