మహారాష్ట్రలో శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ శిందే ఎన్నికయ్యారు. ముంబయిలో పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో జరిగిన శాసన సభ్యుల సమావేశంలో శిందేను ఎన్నుకున్నారు.
శిందే పేరును ఉద్దవ్ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ప్రతిపాదించగా, ఇతర సభ్యులు బలపర్చారు. ముందుగా ఆదిత్యనే పక్షనేతగా ఎన్నుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ.. ఉద్ధవ్ ఠాక్రే ఇందుకు నిరాకరించినట్లు సమాచారం.