తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజల గుండెల్లో షీలా చిరస్థాయిగా నిలుస్తారు'

భారత రాజకీయాల్లో సుదీర్ఘంగా వెలుగొందిన షీలా దీక్షిత్​ మరణంపై దేశవ్యాప్తంగా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు విచారం వ్యక్తం చేశారు.

By

Published : Jul 20, 2019, 9:40 PM IST

షీలాతో మోదీ

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత షీలా దీక్షిత్ మరణం దేశవ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. గొప్ప నేతను కోల్పోయామని రాజకీయనేతలు, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి విచారం

"షీలా దీక్షిత్​ మరణ వార్త బాధ కలిగించింది. ఒక సీనియర్​ రాజకీయ వేత్తను కోల్పోయాం. రాజధాని ముఖచిత్రం మారడంలో షీలా కృషి గుర్తుంచుకోదగినది."

-రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

ప్రధాని దిగ్భ్రాంతి

"షీలాజీ మరణం ఎంతో బాధించింది. ఆమెది స్నేహపూర్వక వ్యక్తిత్వం. దిల్లీ అభివృద్ధిలో ఆమె భాగస్వామ్యం మరువలేం. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి."

-ప్రధాని నరేంద్రమోదీ

ఎంతో బాధించింది: రాహుల్

షీలా మరణంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ సహా ఇతర అగ్రనేతలు విచారం వ్యక్తం వేశారు.

"షీలాజీ మరణం ఎంతో బాధించింది. ఆమె కాంగ్రెస్ ప్రియ పుత్రిక. మూడు సార్లు దిల్లీ సీఎంగా ఎన్నికయి.. రాజధానికి ఎంతో సేవ చేశారు."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

"మీరు లేరన్న మాట ఎంతో బాధను కలిగిస్తోంది. జీవితాంతం కాంగ్రెస్ వ్యక్తిగా ఉన్నారు. 3 సార్లు సీఎంగా దిల్లీ ముఖచిత్రాన్నే మార్చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి."

-కాంగ్రెస్​

"వార్త తెలియగానే నిశ్చేష్ఠుడినయ్యాను. ఆమె మరణంతో బాధ్యాతాయుతమైన కాంగ్రెస్​ నాయకురాలిని కోల్పోయాం. దిల్లీ అభివృద్ధిలో ఆమె పాత్ర నగరవాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతుంది."

- డాక్టర్​ మన్మోహన్​ సింగ్​, మాజీ ప్రధాని

"షీలాజీ మరణవార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యా. నన్ను ఎంతో ప్రేమించేవారు. దిల్లీతో పాటు దేశానికి ఆమె చేసిన సేవ చిరస్మరణీయం. పార్టీలో గొప్ప నాయకురాలు. పార్టీకి, దేశ రాజకీయాల్లో షీలాజీ పాత్ర అనితర సాధ్యం."

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి: అనుకోకుండా వచ్చి ఉన్నత శిఖరాలకు చేరి..

ABOUT THE AUTHOR

...view details