తెలంగాణ

telangana

ETV Bharat / bharat

థరూర్​ సహా 23మందికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు - Shashi Tharoor, Nand Kishore Acharya among writers to receive Sahitya Akademi Award 2019

కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ను సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. 'యాన్‌ ఎరా అఫ్‌ డార్క్‌నెస్‌' పుస్తకానికి గానూ ఆయన కేంద్ర పురస్కారం అందుకోనున్నారు. 2020 ఫిబ్రవరి 25న దిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

Shashi Tharoor, Nand Kishore Acharya among writers to receive Sahitya Akademi Award 2019
థరూర్​ సహా 23మందికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

By

Published : Dec 19, 2019, 5:38 AM IST

Updated : Dec 19, 2019, 7:11 AM IST

2019 ఏడాదికిగానూ కేంద్ర సాహిత్య పురస్కారాల విజేతలను ప్రకటించింది 'ది నేషనల్​ అకాడెమీ ఆఫ్​ లెటర్స్​'. మొత్తం 23 మంది ఈ అవార్డును అందుకోనున్నారు. వీరిలో కాంగ్రెస్‌ సీనియర్ నేత, పార్లమెంట్‌ సభ్యుడు శశి థరూర్‌తో పాటు నంద కిశోర్​ ఆచార్య ఉన్నారు.

నాన్‌ ఫిక్షనల్‌ విభాగంలో థరూర్‌ ఆంగ్ల రచన 'యాన్‌ ఎరా ఆఫ్‌ డార్క్‌నెస్‌' పుస్తకానికిగానూ ఈ అవార్డు దక్కింది. భారత్‌పై బ్రిటిష్‌ పాలకుల ప్రభావం గురించి తెలియజేస్తూ థరూర్‌ ఈ పుస్తకం రాశారు. థరూర్​తో పాటు మొత్తం 23 మంది ఈ అవార్డు అందుకోనున్నారు. హిందీ నవల 'చీలేతే హో ఆప్నే కో'కుగానూ కిశోర్​ ఆచార్యకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు

2020 ఫిబ్రవరి 25న ప్రదానం

భారత వనరులను ఆంగ్లేయులు ఏ విధంగా అపహరించింది, పరిశ్రమల వినాశనాన్ని గురించి.. అందులో వివరించారు. శశిథరూర్‌ ఇదివరకు రియట్‌, ది గ్రేట్‌ ఇండియన్‌ నావెల్‌ వంటి నవలలు వై అయామ్‌ ఏ హిందూ, ది పారాడాక్సికల్‌ ప్రైమ్‌మినిస్టర్‌ వంటి నాన్‌ ఫిక్షనల్‌ కథలు రాశారు. 2020 ఫిబ్రవరి 25న దిల్లీలో జరిగే కార్యక్రమంలో పురస్కార గ్రహీతలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.

Last Updated : Dec 19, 2019, 7:11 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details