తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపాలోకి షహీన్​బాగ్ నిరసనకారుడు అలీ

దిల్లీ షహీన్​బాగ్​కు చెందిన సామాజిక కార్యకర్త షహ్​జాద్​ అలీ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశ్​ గుప్తా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

By

Published : Aug 16, 2020, 5:38 PM IST

Shaheen Bagh social activist Shahzad Ali joins BJP
భాజపాలోకి షహీన్​బాగ్ సామాజిక కార్యకర్త షహ్​జాద్​ అలీభాజపాలోకి షహీన్​బాగ్ సామాజిక కార్యకర్త షహ్​జాద్​ అలీ

దిల్లీ షహీన్​బాగ్ నిరసనకారుడు, సామాజిక కార్యకర్త షహ్​జాద్​ అలీ భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశ్​ గుప్తా, మరో నేత శ్యాం జాజు సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అలీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆదేశ్​.

అలీకి స్వీట్​ తినిపిస్తోన్న అదేశ్​ గుప్తా

'భాజపాను శత్రువుగా భావిస్తున్న మా వర్గం వారి ఆలోచన తప్పు అని నిరూపించేందుకు నేను భాజపాలో చేరాను​. సీఏఏ ఆందోళనలపై వారితో కలిసి చర్చిస్తాం' అని చెప్పారు అలీ.

మోదీ ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని సవరించడానికి వ్యతిరేకంగా దిల్లీలోని షహీన్​బాగ్​లో 2019 డిసెంబర్ 14 నుంచి 2020 మార్చి 24 వరకు తీవ్ర నిరసనలు జరిగాయి. ఆ ప్రాంతంలోకి మరెవ్వరూ అడుగుపెట్టకుండా రహదారులన్నింటినీ పూర్తిగా దిగ్బంధించి... మహిళలు, చిన్నారులు సైతం పాల్గొన్న ఆ నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆ ఆందోళనల్లో పాల్గొన్న వ్యక్తి ఇప్పుడు భాజపాలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పార్టీ కండువా కప్పుతోన్న భాజపా రాష్ట్ర్ర అధ్యక్షుడు

ఇదీ చూడండి: విడాకుల్లో ఒకే విధానం కోరుతూ సుప్రీంలో వ్యాజ్యం

ABOUT THE AUTHOR

...view details