తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నక్సల్స్ ఏరివేతపై సీఎంలతో అమిత్​ షా సమీక్ష

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాల కార్యకలాపాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. గత ఐదేళ్లలో హింసాయుత ఘటనలు గణనీయంగా తగ్గాయని హోంశాఖ తెలిపింది.

By

Published : Aug 26, 2019, 2:20 PM IST

Updated : Sep 28, 2019, 7:54 AM IST

నక్సల్స్ ఏరివేతపై సీఎంలతో అమిత్​ షా సమీక్ష

నక్సల్స్ ఏరివేతపై సీఎంలతో అమిత్​ షా సమీక్ష

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గత ఐదేళ్లల్లో హింస గణనీయంగా తగ్గిందని కేంద్ర హోంశాఖ తెలిపింది. వామపక్ష తీవ్రవాద సమస్యపై దిల్లీలో కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. నక్సల్స్​ ఏరివేతకు చేపడుతున్న కార్యకలాపాలు, ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు.

ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్​, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్​గఢ్​​ సీఎంలు పాల్గొన్నారు. పారా మిలటరీ దళాల ఉన్నతాధికారులు, హోంశాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

2009 నుంచి 2013 వరకు దేశంలో 8 వేల 782 నక్సల్ హింస కేసులు నమోదైతే.. 2014 నుంచి 2018 వరకు 4 వేల 969 కేసులు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 2009 నుంచి 2013 వరకు 3,326 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. 2014-18లో 1,321 మంది మరణించారని తెలిపింది.

స్థిరమైన ప్రభుత్వ విధానాలతో వామపక్ష తీవ్రవాదం క్రమంగా క్షీణిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లో వెయ్యి కోట్లతో కేంద్రం మౌలిక వసతులు కల్పిస్తోందన్నారు.

ఇదీ చూడండి: మన్మోహన్​ సింగ్​కు ఎస్​పీజీ భద్రత తొలగింపు

Last Updated : Sep 28, 2019, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details