తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య' తీర్పు ఆలస్యానికి కాంగ్రెస్సే కారణం: షా - అయోధ్య రామమందిరం జాప్యానికి కాంగ్రెస్సే కారణం

అయోధ్య రామమందిరం విషయంలో కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర హోంమంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిప్పులు చెరిగారు. అయోధ్య తీర్పు జాప్యానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ఆయన నిందించారు. కశ్మీర్​ సమస్య పరిష్కారం ఆలస్యానికీ కాంగ్రెస్​ దురాశే కారణమని అన్నారు. ఝార్ఖండ్​ లోహర్​దగ్గాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి.

'అయోధ్య' తీర్పు ఆలస్యానికి కాంగ్రెస్సే కారణం: షా

By

Published : Nov 21, 2019, 5:09 PM IST

Updated : Nov 21, 2019, 9:20 PM IST

'అయోధ్య' తీర్పు ఆలస్యానికి కాంగ్రెస్సే కారణం: షా

అయోధ్య కేసులో జాప్యానికి కాంగ్రెస్సే ప్రధాన కారణమని ఆరోపించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. కొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్​లో ప్రచార శంఖారావాన్ని పూరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మనీకా, లోహర్​దగ్గాలలో ర్యాలీలు నిర్వహించారు కేంద్ర మంత్రి.

''ప్రతి ఒక్కరూ అయోధ్యలో రామ మందిరం కోరుకున్నారు. కానీ కాంగ్రెస్​ ఈ కేసును నాన్చుకుంటూ వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి తీర్పు రాలేదు. రాజ్యాంగానికి లోబడి ఈ వివాదానికి సరైన పరిష్కారం రావాలని మేం కోరుకున్నాం. ఇప్పుడు రాముని ఆశీర్వాదంతో.. రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు మార్గం సుగమం చేసింది.''

- అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూవివాదం సహా.. 70 ఏళ్లుగా ఉన్న కశ్మీర్​ సమస్య పరిష్కారాన్నీ కాంగ్రెస్​ ఆలస్యం చేసిందన్నారు షా.

'' కేవలం ఓటు బ్యాంకును కాపాడుకోవాలనే దురాశతో.. 70 ఏళ్లుగా కశ్మీర్​ సమస్యను కాంగ్రెస్​ అట్టిపెట్టుకొని ఉంది. కానీ మోదీ... భారత దేశ కిరీటం నుంచి అధికరణ 370 అనే కళంకాన్ని రద్దు చేసి.. కశ్మీర్​ అభివృద్ధికి దారి చూపారు.''

- అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

అవినీతి ఉచ్చులో...

ఝార్ఖండ్​లోని కాంగ్రెస్​-జేఎంఎం కలిసి అవినీతికి పాల్పడ్డాయని విమర్శించారు షా. ఇంకా పేదలు, గిరిజనులను ఈ రెండు పార్టీలు మోసం చేశాయన్నారు. భాజపా ముఖ్యమంత్రి రఘుబర్​దాస్​ నేతృత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందన్నారు. రాష్ట్రంలో కాషాయ పార్టీనే నక్సల్స్​ బెడదను తగ్గించిందని చెప్పారు. ప్రజలకు కనీస సదుపాయాలు అందించడంలో కాంగ్రెస్​ ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు.

ఇవీ చూడండి:

ఝార్ఖండ్​ ఎన్నికలకు మోగిన నగారా- 5 దశల్లో పోలింగ్

ఝార్ఖండ్​ అభివృద్ధి కోసం భాజపాకు 5 లక్షల సూచనలు

Last Updated : Nov 21, 2019, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details