తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"అమరులను అవమానిస్తారా,క్షమాపణ చెప్పండి"

కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల బాధ్యుడు శ్యామ్​ పిట్రోడా వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ లక్ష్యంగా భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ప్రశ్నల వర్షం కురిపించారు.

By

Published : Mar 23, 2019, 6:53 PM IST

Updated : Mar 24, 2019, 11:35 AM IST

అమిత్ షా

కాంగ్రెస్​పై అమిత్​ షా ధ్వజం
కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల బాధ్యుడు శ్యామ్​ పిట్రోడా వ్యాఖ్యలపై భాజపా అధ్యక్షుడు అమిత్​ షా తీవ్రంగా మండిపడ్డారు. దేశం కోసం అమరులైన వారిని కాంగ్రెస్ అవమానించిందని ధ్వజమెత్తారు. భాజపానే ప్రజల్ని రక్షిస్తోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అరాచక పాలన సాగుతుందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా ప్రశ్నలు సంధించారు అమిత్ షా.

"నేను కాంగ్రెస్​ పార్టీని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మీరు చెప్పిన దాని ప్రకారం.. దేశ ప్రజలను భయాందోళనలకు గురిచేసిన దాడులను సాధారణ ఘటనగా భావిస్తున్నారా? మీ పార్టీ నేత కొంత మంది చేసిన పనికి దేశం(పాకిస్థాన్​) మొత్తం మీద పడాల్సిన అవసరం లేదంటున్నారు. కాంగ్రెస్ దీన్ని అంగీకరిస్తుందా? దేశంలో జరిగే ఉగ్రదాడులకు పాకిస్థాన్​కు​, దాని సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పగలదా? ఉగ్రదాడులకు మెరుపుదాడులతో బదులివ్వకూడదని కాంగ్రెస్ చెబుతోంది. చర్చలతోనే పరిష్కరించాలంటోంది. కాంగ్రెస్ చెబుతున్నది సాధ్యమయ్యే చర్యేనా? ఈ మూడు ప్రశ్నలపై ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలి. "
-అమిత్ షా, భాజపా జాతీయాధ్యక్షుడు

జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ భారత వాయుసేనపై అనుమానాలు వ్యక్తం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు అమిత్​ షా. ఓ విశ్వవిద్యాలయంలో దేశ వ్యతిరేక నినాదాలు చేస్తున్న వారికి మద్దతు పలికి మీరేంటో తెలియజెప్పారని విమర్శించారు.

రాజకీయంలో వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా ఉంటాయా అని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్​లో చాలా మంది నాయకులు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని, వారందరి తరఫున దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అమిత్ షా.

ఇదీ చూడండి:హోదా ఎందుకు ఇవ్వరు?: ముఖాముఖిలో రాహుల్​

Last Updated : Mar 24, 2019, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details