తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వందే భారత్'​తో సొంతూళ్లకు 17.22 లక్షల మంది​

వందేభారత్​ మిషన్​లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను భారీ సంఖ్యలో స్వదేశానికి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్​7 నాటికి 17.22 లక్షల మందిని సొంతూళ్లకు చేర్చినట్లు స్పష్టం చేసింది.

By

Published : Oct 9, 2020, 6:47 AM IST

seventeen lakh Indians have returned from abroad under 'Vande Bharat' mission
వందే భారత్​తో సొంతిళ్లకు చేరిన 17.22 లక్షల మంది​

కరోనా మహమ్మారి దృష్ట్యా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సొంతిళ్లకు తీసుకొచ్చేందుకు.. కేంద్ర ప్రభుత్వం వందే భారత్​ మిషన్​ను మే 7న ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా 17.22 లక్షల మంది స్వదేశానికి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అక్టోబర్​లో 1873 విమానాలు

వందే భారత్​ మిషన్​లో భాగంగా అక్టోబర్​లో భారత్​ నుంచి 25 దేశాలకు 1,875 విమానాలు నడిచాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ తెలిపారు. ఈ 25 దేశాల్లో 14 దేశాలు భారత్​తో ఎయిర్​ బబుల్​ ఒప్పందం చేసుకున్నవేనని మీడియాతో జరిపిన వర్చువల్​ సమావేశంలో వివరించారు.

స్వదేశంలో 24 విమానాశ్రయాల్లోకి

ఏడో దశలో సేవలందించిన విమానాల్లో ఎయిర్​ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్​ప్రెస్, ప్రైవేటు, విదేశీ విమానాలు, చార్టెడ్​ విమానాలు ఉన్నాయని శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ సేవలను అందించేందుకు స్వదేశంలోని 24 విమానాశ్రయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. రానున్న రోజుల్లో అవసరాల రీత్యా మరికొన్ని విమానాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:పండుగల వేళ విమాన సర్వీసులు పెంపు!

ABOUT THE AUTHOR

...view details