తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పరువు నష్టం కేసులతో రాహుల్​ బిజీబిజీ

దేశవ్యాప్తంగా తనపై నమోదైన పరువునష్టం కేసులతో... రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ బిజీబీజీగా గడపనున్నారు. తమ పార్టీ సిద్ధాంతాలను రాహుల్ కించపరిచారంటూ, తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ పలు రాష్ట్రాల్లో భాజపా-ఆర్​ఎస్​ఎస్​ నేతలు ఈ కేసులు దాఖలు చేశారు.

By

Published : Jul 4, 2019, 4:46 PM IST

పరువు నష్టం కేసులతో రాహుల్​ బిజీబిజీ

కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీని... పరువు నష్టం కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా తనపై నమోదైన పరువు నష్టం కేసుల్లో... విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంటుంది.

గురువారం ముంబయి కోర్టు ముందు హాజరయ్యారు రాహుల్. పాత్రికేయురాలు గౌరీలంకేష్​ హత్య సమయంలో... రాహుల్ భాజపా-ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతాలపై విమర్శలు గుప్పించారు. దీనిపై సంఘ్ కార్యకర్త, న్యాయవాది జోషి పరువునష్టం కేసు వేశారు.

కోర్టు విచారణకు హాజరైన రాహుల్​ తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం రూ.15వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. విచారణ సమయంలో రాహుల్ హాజరుపై మినహాయింపు నిచ్చింది.

థానేలో...

మహాత్మా గాంధీ హత్యకు ఆర్​ఎస్​ఎస్​ కారణమంటూ రాహుల్​గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. థానే జిల్లాలోని బివాండీలో ఓ స్థానిక ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త పరువు నష్టం కేసు వేశారు.

గతేడాది జూన్​లో ఈ కేసు విచారణ కోసం బివాండీ కోర్టు ముందు హాజరైన రాహుల్​... తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. అయితే న్యాయస్థానం ఆయనపై ఐపీసీ సెక్షన్ 499, సెక్షన్​ 500ల కింద పరువునష్టం కేసులు నమోదు చేసింది. ఇవి కూడా త్వరలో విచారణకు రానున్నాయి.

బిహార్... గుజరాత్​ల్లోనూ...

సార్వత్రిక ఎన్నికల సమయంలో భాజపా-ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతాలపై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిహార్, పంజాబ్​ల్లోనూ రాహుల్​పై పరువునష్టం కేసులు నమోదయ్యాయి.

కర్ణాటక కోలార్​లో ఏప్రిల్​ 13న లోక్​సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రాహుల్ భాజపా-ఆర్​ఎస్​ఎస్​పై విమర్శలు గుప్పించారు. నీరవ్​ మోదీ, లతిత్ మోదీ, నరేంద్ర మోదీ... దొంగల పేర్ల వెనుక 'మోదీ' అనే పేరు ఎందుకు కామన్​గా ఉంటుందని రాహుల్ అన్నారు.

రాహుల్ వ్యాఖ్యలపై భాజపా నేత, బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ మోదీ ఏప్రిల్​ 18న పట్నా కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసు జూలై 6న పట్నా కోర్టులో విచారణకు రానుంది. దీనికీ రాహుల్ హాజరుకావాల్సి ఉంది.

అలాగే గుజరాత్​లోని అహ్మదాబాద్, సూరత్​ కోర్టుల్లో నమోదైన పరువునష్టం కేసు విచారణలకూ రాహుల్ హాజరుకావాల్సి ఉంది.

ఇదీ చూడండి: ట్వీట్​తోనే పర్యటకుల సమస్యల పరిష్కారం!

ABOUT THE AUTHOR

...view details