తెలంగాణ

telangana

By

Published : Jan 11, 2020, 11:32 AM IST

ETV Bharat / bharat

'జమ్ము కశ్మీర్​లో ప్రజలు సంతోషంగానే ఉన్నారు'

జమ్ముకశ్మీర్​లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారన్నారు భారత్​లోని వియత్నాం రాయబారి ఫామ్ సాన్ చౌ.  శ్రీనగర్​లో గురువారం పర్యటించిన 15 మంది విదేశీ రాయబారుల బృందంలో ఒకరైన చౌ.. మరిన్ని విషయాలను తెలిపారు.

Seeing is believing, saw normalcy in daily lives- Vietnamese Ambassador on J-K visit
'జమ్ము కశ్మీర్​లో ప్రజలు సంతోషంగానే ఉన్నారు'

జమ్ము కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని శ్రీనగర్​లో పర్యటించిన ప్రతినిధుల బృందంలో ఒకరైన వియత్నాం రాయబారి ఫామ్​ సాన్​ చౌ పేర్కొన్నారు. ప్రజా సంఘాలు, రాజకీయ ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత అక్కడ అంతా సవ్యంగానే ఉన్నట్లు అర్థమైందని తెలిపారు.

"జమ్ముకశ్మీర్​ ప్రజలు సాధారణ జీవితాన్ని గడపడం నేను గమనించా. అక్కడి పరిస్థితుల విషయంలో వారిలో ఎలాంటి ఆందోళన లేదు. చాలా సంతోషంగా ఉన్నారు. మేము జమ్ముకశ్మీర్​కు నిజనిర్ధరణ కోసం రాలేదు. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రతినిధులం కాదు. కేవలం ఇక్కడి పరిస్థితులను మాకు మేముగా అంచనా వేసుకోవడానికి వచ్చాం. అయితే స్థానికులతో మాట్లాడినప్పుడు వారు సంతోషంగా ఉన్నట్లు మాకు అర్థమైంది."

-ఫామ్ సాన్ చౌ, వియత్నాం రాయబారి

జమ్ముకశ్మీర్​లో ప్రస్తుత పరిస్థితులను తెలుసుకునేందుకు భారత్​లోని విదేశీ రాయబారుల బృందం జమ్మూతోపాటు శ్రీనగర్​లో​ పర్యటించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details