తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2019, 1:33 PM IST

ETV Bharat / bharat

వలస కూలీల హత్యతో... నిఘా నీడలోకి కశ్మీర్​

ఉగ్రవాదులు.. ఆరుగురు వలస కూలీలను బలిగొన్న అనంతరం జమ్ముకశ్మీర్​లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్రమూకల కోసం భారత సైన్యం అణువణువూ గాలిస్తోంది. పలు ప్రాంతాలను సైనికుల అధీనంలోకి తీసుకున్న తరుణంలో సాధారణ జనజీవనం స్తంభించింది.

వలల కూలీల హత్యతో... నిఘా నీడలోకి కశ్మీర్​

వలస కూలీల హత్యతో... నిఘా నీడలోకి కశ్మీర్​

జమ్ముకశ్మీర్​లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుల్గాం జిల్లాలో బంగాల్​కు చెందిన కూలీలే లక్ష్యంగా ఉగ్రదాడులు దాడి చేసి.. ఆరుగురిని పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో కశ్మీర్​ లోయలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. ఉగ్రమూకల కోసం తనిఖీలు ముమ్మరం చేశారు. ఆంక్షల నేపథ్యంలో సాధారణ జనజీవనం స్తంభించింది.

రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ​ 370 రద్దు చేసి 87 రోజులైనప్పటికీ.. జనజీవనం సాధారణ స్థితికి రాలేదు. వ్యాపార సముదాయాలు, దుకాణాలు బుధవారం మూసి ఉన్నాయి. ప్రజారవాణా స్తంభించింది. కశ్మీర్​ లోయలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు నెలకొన్నాయి. ఈ ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికేతరులే లక్ష్యంగా దేశ విద్రోహ శక్తులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా భద్రత దళాలు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు అధికారులు. దక్షిణ కశ్మీర్​తో పాటు శ్రీనగర్​, ఇతర ప్రాంతాల్లో బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు.

ఈయూ బృందం పర్యటన సందర్భంగా..

ఆర్టికల్​ 370 రద్దు, అనంతర పరిణామాలపై అధ్యయనం చేసేందుకు ఐరోపా సమాఖ్యకు చెందిన 27 మంది ఎంపీల బృందం కశ్మీర్​లో పర్యటించింది. ఈ సమయంలోనే ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వలస కూలీలే లక్ష్యంగా ఉగ్రదాడులు చేపట్టారు. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.

మొబైల్​ సేవల పునరుద్ధరణ..

కశ్మీర్​ లోయ వ్యాప్తంగా ల్యాండ్​లైన్​, పోస్ట్​పెయిడ్​ మొబైల్​ సేవలను పునరుద్ధరించారు అధికారులు. కానీ అంతర్జాల సేవల నిలిపివేత కొనసాగుతోంది. ఆగస్టు 5 నుంచి ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: మరోసారి హద్దు మీరిన పాక్​.. కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details