తెలంగాణ

telangana

By

Published : Apr 15, 2019, 3:47 PM IST

ETV Bharat / bharat

ఊర్మిళ ర్యాలీలో భాజపా, కాంగ్రెస్​ శ్రేణుల ఘర్షణ

సినీ నటి, కాంగ్రెస్ నేత​ ఊర్మిళ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు భాజపా కార్యకర్తలు ప్రధాని మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్​ కార్యకర్తలు నినదించారు. ఫలితంగా... ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

ఊర్మిళ ర్యాలీలో మోదీ నినాదాలు.. కార్యకర్తల ఘర్షణ

ఊర్మిళ ర్యాలీలో మోదీ నినాదాలు.. కార్యకర్తల ఘర్షణ

సినీ నటి, ఉత్తర ముంబయి లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి ఊర్మిళా మాతోండ్కర్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గందరగోళం చోటుచేసుకుంది. ముంబయిలోని బోరువాలీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఊర్మిళ పాల్గొన్నారు. స్థానిక రైల్వేస్టేషన్​ సమీపానికి ర్యాలీ చేరుకోగానే... కొందరు భాజపా కార్యకర్తలు 'మోదీ... మోదీ' అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్​ కార్యకర్తలు ఒకింత అసహనానికి లోనయ్యారు. 'చౌకీదార్​ చోర్​ హై' అని నినదించారు. చివరకు ఇరు పార్టీల కార్యకర్తలు గొడవపడ్డారు. ఒకరిని ఒకరు కొట్టుకున్నారు.

ఈ ఘటనపై ఉర్మిళ​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.

ఉత్తర ముంబయి నుంచి భాజపా సిట్టింగ్ ఎంపీ గోపాల్​ శెట్టిపై ​ కాంగ్రెస్​ తరఫున పోటీకి దిగారు ఊర్మిళ.

ABOUT THE AUTHOR

...view details