తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రఫేల్​ తీర్పుపై సమీక్షించడానికి ఏమీ లేదు'

రఫేల్​ వ్యవహారంలో డిసెంబర్​ 14 తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించింది. కొన్ని వార్తా పత్రికల కథనాలను ఆధారంగా చేసుకుని సుప్రీం తీర్పును సమీక్షించమని ఎలా అడుగుతారని పిటిషనర్లను ప్రశ్నించింది.

By

Published : May 4, 2019, 5:08 PM IST

రఫేల్

రఫేల్​ ఒప్పందంపై విచారణ అవసరం లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్​ సమర్పించింది. డిసెంబర్​ 14న రఫేల్​పై సుప్రీం ఇచ్చిన తీర్పులో ఎలాంటి పొరపాట్లు లేవని తెలిపింది. ఈ ప్రమాణపత్రంపై సోమవారం విచారణ జరగనుంది.

అసమగ్ర వివరాలతో కొన్ని వార్తాపత్రికలు ప్రచురించిన కథనాలను ఆధారంగా చేసుకుని సుప్రీం తీర్పును ఎలా ప్రశ్నిస్తారని పిటిషనర్లను కేంద్రం నిలదీసింది. పరిమితమైన అంశాలలో లోపాలుంటే మొత్తం విషయంపై సమీక్ష ఎందుకని ఆక్షేపించింది.

"మీడియా నివేదికల ఆధారంగా కోర్టులు తీర్పులు చెప్పలేవు. వాటిని చూపించి కోర్టు నిర్ణయాన్ని కూడా ప్రశ్నించలేం. ఎలాంటి అధికారిక ఆధారాలు లేని వ్యాజ్యాలతో సమీక్షను ఎలా నిర్వహిస్తారు. పూర్తి సమాచారం లేని అసమగ్ర పత్రాలు సమీక్షకు ఎలా సరిపోతాయి? అయినా ఒప్పందానికి సంబంధించిన అన్ని పత్రాలు 'కాగ్​'కు అందుబాటులో ఉంచాం. యుద్ధ విమానాల కొనుగోలు ఖర్చు గతంతో పోలిస్తే 2.86 శాతం తక్కువేనని నివేదిక ఇచ్చారు. "
-కేంద్రం ప్రమాణ పత్రం సారాంశం

ఫ్రాన్స్​ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు​ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని సుప్రీంకోర్టు గతేడాది డిసెంబర్​ 14న తీర్పు ఇచ్చింది. కోర్టు నిర్ణయంపై పునఃసమీక్ష జరపాలని కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్​ సిన్హా, ప్రముఖ న్యాయవాది

శాంత్​ భూషణ్​ పిటిషన్ దాఖలు చేశారు. ఒప్పందంలో అక్రమాలు జరిగాయని ఆప్​ నేత సంజయ్​ సింగ్​, మరో న్యాయవాది వినీత్​ దంఢా కూడా అప్పీలు చేశారు. అన్నింటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం.. పిటిషన్లపై వివరణ కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సమాధానంగా కేంద్రం ఈ ప్రమాణపత్రం సమర్పించింది.

ఇదీ చూడండి:ఫొని బీభత్సం-అస్తవ్యస్తంగా ఒడిశాలో జనజీవనం

ABOUT THE AUTHOR

...view details