తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ములాయం, మాయ ఐక్యరాగం- మోదీపై ధ్వజం

ఉత్తరప్రదేశ్​ మైన్​పురిలో ఎస్పీ- బీఎస్పీ కూటమి ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ములాయం- మాయావతి పాల్గొన్నారు. పరస్పరం ప్రశంసించుకుంటూ మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ములాయం, మాయ ఒకే వేదిక పంచుకోవడం దాదాపు 26 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

By

Published : Apr 19, 2019, 3:45 PM IST

ములాయం, మాయ ఐక్యతారాగం- మోదీపై ధ్వజం

ఎన్నో ఏళ్లు ప్రత్యర్థులుగా కత్తులు దూసుకున్న అగ్రనేతలు... ఇప్పుడు ఒకే వేదికపై తమ ఐక్యమత్యాన్ని దేశానికి చాటిచెప్పారు. సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్​ యాదవ్​, బహుజన్​ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి దాదాపు 26 ఏళ్ల అనంతరం ఒకే వేదిక పంచుకున్నారు. ఇందుకు ఉత్తరప్రదేశ్​లోని మైన్​పురి ర్యాలీ వేదికైంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఎస్పీ- బీఎస్పీ కూటమి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎస్పీ వ్యవస్థాపకుడు పోటీ చేస్తున్న లోక్​సభ స్థానంలో గురువారం భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ములాయం- మాయావతి తమ బలాన్ని ప్రదర్శించారు.

బీఎస్పీ అధినేత్రిని ఎల్లప్పుడూ గౌరవించాలని ఎస్పీ కార్యకర్తలకు సూచించారు ములాయం.

ఎస్పీ వ్యవస్థాపకుడిపై ప్రశంసల వర్షం కురిపించారు మాయావతి. ఉత్తరప్రదేశ్​వాసుల నిజమైన నాయకుడు ములాయమేనని కీర్తిస్తూ... ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు.

సభలో మాట్లాడుతున్న మాయావతి

"సమాజ్​వాదీ పార్టీ కోసం ములాయం ఎన్నో సేవలు చేశారు. ఉత్తరప్రదేశ్​లోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పాటుపడ్డారు. వెనకబడిన వర్గాల కోసం ఎనలేని సేవలందిచారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు ములాయంనే తమ అసలైన నాయకుడని నమ్ముతారు. ములాయం సింగ్​ యాదవ్​ అసలైన బీసీ నాయకుడు. ప్రధాని మోదీలా నకిలీ బీసీ నాయకుడు కాదు. "
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి

ఎస్పీతో పొత్తు పెట్టుకోవడాన్ని మరోమారు సమర్థించుకున్నారు మాయ. పార్టీ, ప్రజల ప్రయోజనాల కోసం కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తప్పదని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి: "భాజపా ప్రభుత్వం పేదలకు వ్యతిరేకం "

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details