తెలంగాణ

telangana

'ధిక్కరణ'పై రాహుల్​ క్షమాపణను అంగీకరిస్తుందా?

By

Published : Nov 14, 2019, 6:16 AM IST

కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ 'చౌకీదార్​ చోర్​హై' వ్యాఖ్యల కేసుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. కోర్టు ధిక్కరణ వ్యవహారంలో రాహుల్​ చెప్పిన బేషరతు క్షమాపణల్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని, కేసును కొట్టివేస్తుందో లేదో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

'ధిక్కరణ'పై రాహుల్​ను సుప్రీంకోర్టు మన్నిస్తుందా?

కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ.. రఫేల్ ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి 'చౌకీదార్ చోర్​ హై' (కాపలాదారే దొంగ) అనడం, ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు తప్పుగా ఆపాదించిన అంశాలపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. రఫేల్ పునఃసమీక్ష వ్యాజ్యాలపై నిర్ణయంతోపాటే ఈ అంశంపైనా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది.

కోర్టుకు ఆపాదన

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గత ఏడాది డిసెంబర్​ 14న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఏప్రిల్ 10న ఉత్తర్వలు ఇచ్చింది. అయితే ఈ తీర్పు 'కాపలాదారే దొంగ' అనే అంశాన్ని స్పష్టం చేస్తోందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.

కోర్టు ధిక్కరణ కేసు

సుప్రీంకోర్టు తీర్పునకు రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను ఆపాదించారంటూ భాజపా ఎంపీ మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. కోర్టు సైతం ఇదే విషయమై రాహుల్​ గాంధీకి ఏప్రిల్ 23న నోటీసులు జారీ చేసింది.

బేషరతు క్షమాపణలు

'రఫేల్​' విషయంలో కోర్టు తీర్పును మోదీకి తప్పుగా ఆపాదించినందుకు రాహుల్ గాంధీ బేషరతు క్షమాపణలు చెప్పారు. న్యాయస్థానంపై తనకు పూర్తి గౌరవం ఉందని పేర్కొన్నారు. తను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని .. కోర్టు ధిక్కరణ పిటిషన్​ కొట్టివేయాలంటూ అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్థనను తిరస్కరించాలని మీనాక్షి లేఖి తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి న్యాయస్థానాన్ని కోరారు.

తీర్పు రిజర్వ్​

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మే 10న తన తీర్పును రిజర్వ్ చేసింది.

ఇదీ చూడండి:మరో అరుదైన ఘనత సాధించిన నీతా అంబానీ





For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details