తెలంగాణ

telangana

By

Published : Oct 22, 2019, 5:47 AM IST

ETV Bharat / bharat

చిదంబరం బెయిల్​ పిటిషన్​పై నేడు సుప్రీంకోర్టు తీర్పు..!

కాంగ్రెస్​ సీనియర్​ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం బెయిల్​ పిటిషన్​ను నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. ఐఎన్​ఎక్స్​ మీడియా అవినీతి కేసులో ఆయన బెయిల్​కు సంబంధించి ఇవాళ సుప్రీంలో తీర్పు వెలువడే అవకాశముంది. దిల్లీ హైకోర్టు బెయిల్​కు నిరాకరించినందున.. సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు చిదంబరం.

చిదంబరం బెయిల్​ పిటిషన్​పై నేడు సుప్రీంకోర్టు తీర్పు..!

ఐఎన్​ఎక్స్​ మీడియా అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం బెయిల్​ పిటిషన్​పై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. దిల్లీ హైకోర్టు బెయిల్​కు నిరాకరించినందున అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు చిదంబరం.

ఆగస్టు 21న అరెస్టు

ఇప్పటికే ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో చిదంబరాన్ని ఆగస్టు 21న అరెస్టు చేసింది సీబీఐ. అనంతరం 15 రోజుల పాటు ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ కస్టడీలోనే ఉన్నారు. ఆపై జ్యుడీషియల్​ కస్టడీ నిమిత్తం తిహార్​ జైలుకు తరలించారు. తాజాగా ఇదే కేసుకు సంబంధించి చిదంబరంపై దిల్లీకోర్టులో సీబీఐ చార్జ్​షీట్​ దాఖలు చేసింది. ఈ చార్జ్​షీట్​​లో మాజీ మంత్రి కుమారుడు కార్తీ చిదంబరం, ఐఎన్​ఎక్స్​ మాజీ ప్రమోటర్లు ఇంద్రాణి- పీటర్​ ముఖర్జీలు సహా 14 మందిపై చార్జ్​షీట్​ దాఖలైంది. సీబీఐ నమోదు చేసిన కేసులో చిదంబరం జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 24 వరకు పొడిగించింది న్యాయస్థానం.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో ఆరోపణలు

యూపీఏ హయాంలో 2004-14 మధ్యలో కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు చిదంబరం. ఆయన ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్​ఎక్స్​ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అక్రమంగా పొందిందన్న ఆరోపణలతో 2017 మే 15న సీబీఐ ఛార్జీషీట్​ దాఖలు చేసింది. అనంతరం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

వాదనలు వినిపించేది వీరే...

సీబీఐ కేసులో బెయిల్​ ఇవ్వాలంటూ చిదంబరం తరఫున న్యాయవాదులు కపిల్​ సిబల్​, అభిషేక్​ మను సింఘ్వీ వాదించనున్నారు. ఈ విషయంపై సోలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా సీబీఐ తరఫున వాదనలు వినిపించనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details